అక్కినేని కోసం అంజ‌నాదేవి సాహ‌సం

ఈ సంగ‌తి మీకు తెలుసా..? చిరంజీవి మాతృమూర్తి అంజ‌నాదేవి అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి వీరాభిమాని. అక్కినేని సినిమా చూడ‌డం కోసం ఆమె చాలా పెద్ద సాహ‌స‌మే చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్ నేష‌న‌ల్ అవార్డు ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఆదివారం సాయింత్రం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. రేఖ‌, బోనీక‌పూర్ (శ్రీ‌దేవి త‌ర‌పున) చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు స్వీక‌రించారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరు. అంతేకాదు…త‌న త‌ల్లి ఏఎన్నార్‌కి వీరాభిమాని అని చెబుతూ ఓ సంఘ‌ట‌న క‌థ‌గా చెప్పి వినిపించారు.

“ఆరు ద‌శాబ్దాల క్రితం. ఓ ప‌ల్లెటూరులోని నిండు గ‌ర్భ‌వ‌తి. ప్ర‌స‌వానికి సిద్ధంగా ఉంది. అలాంట‌ప్పుడు పక్క టౌనులో త‌న అభిమాన క‌థానాయ‌కుడి సినిమా వచ్చింది. అది చూడాల‌న్న కోరిక‌ను భ‌ర్త ముందు వెలుబుచ్చింది. భార్య కోరిక కాద‌న‌కుండా ఆ భ‌ర్త ఓ జ‌ట్కా బండి పురమాయించి టౌనుకు బ‌య‌ల్దేరాడు. మ‌ధ్య‌లో చిన్న ప్ర‌మాదం కూడా జ‌రిగింది. భార్య‌కు చిన్న‌పాటి గాయాల‌య్యాయి. అయినా త‌ను గాయాల్ని లెక్క చేయ‌లేదు. `సినిమా చూసే ఇంటికి వెళ్తాం` అంది. భార్య కోరిక మేర‌కు ఆ భ‌ర్త సినిమా చూపించాడు. ఇంటికొచ్చాక భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ ఆనందించారు. ఆ భార్యాభ‌ర్త‌లెవ‌రో కాదు.. మా అమ్మానాన్న‌లు. అప్పుడు క‌డుపులో ఉన్న బిడ్డ‌ను నేనే. వాళ్లు చూడాల‌నుకున్న సినిమాలో హీరో ఏఎన్నార్‌. మా అమ్మ ఆయ‌న‌కు వీరాభిమాని. క‌డుపులో ఉండ‌గానే న‌న్ను సినిమాకి తీసుకెళ్లింది. అలా సినిమాపై నాక్కూడా ప్రేమ పుట్టిందేమో” అన్నారు చిరంజీవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close