ఫిబ్రవరి ఒకటి నుంచి జనంలోకి జగన్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. పాలన చేపట్టి ఎనిమిది నెలలయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆయన గ్రామాల్లో పర్యటించాలనుకుంటున్నారు. ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల పనితీరు ఎలా ఉంది..? ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూరింది..? వంటి అంశాలపై నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకునేలా.. కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు అధికారులు. అయితే.. ఇది రచ్చబండ కార్యక్రమం కాదని.. అలాంటిదని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించాలని నిర్ణయించారు.. ఎక్కడ నుంచి ప్రారంభించాలి… ఎలా ప్రారంభాలి.. ఎన్ని జిల్లాలు తిరగాలి అన్న దానిపై.. కసరత్తు జరుగుతోంది.

జగన్మోహన్ రెడ్డి.. మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి రోజున తన తండ్రి ప్రారంభించాలని ఆలోచించి.. ప్రారంభించడానికి వెళ్తూ.. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన.. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటించారు. వైఎస్ రెండో సారి గెలిచిన తర్వాత రచ్చబండ అనే కార్యక్రమానికి ప్లాన్ చేశారు. చిత్తూరు జిల్లా ఓ పథకాన్ని ప్రారంభించడానికి వెళ్తూనే హెలికాఫ్టర్ ప్రమాదానికి గురయ్యారు. దాన్ని కొనసాగించాలని జగన్ అనుకుటున్నారని.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి. ఇంత వరకూ ఆ కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఇప్పుడు కూడా రచ్చబండ లాంటి కార్యక్రమం అంటున్నారు కానీ.. రచ్చబండ అనడం లేదు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో.. ప్రజాదర్బార్ కూడా నిర్వహించేవారు రోజూ ఉదయం సామాన్యుల్ని కొంత సేపు కలిసేవారు. ఆ కార్యక్రమం కూడా.. తాను చేపట్టాలనుకుంటున్న జగన్.. జూన్ ఒకటో తేదీ నుంచి ప్రజాదర్భార్ అని ప్రకటన చేశారు. దాని కోసం.. రూ. రెండు కోట్లు పెట్టి ఓ నిర్మాణం కూడా చేశారు. కానీ ఇంత వరకూ.. ఎలాంటి ప్రజాదర్భార్ పాటించలేదు. సామాన్యులెవరూ జగన్ ఇంటి వద్దకు రాకుండా 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకూ జగన్ చేపట్టిన ప్రతీ కార్యక్రమం వాయిదాలు వేస్తూనే ఉన్నారు. మరి ఈ రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని అయినా ప్రారంభిస్తారో.. చివరికి వాయిదా వేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close