సుగాలి ప్రీతి కేసు సీబీఐ విచారణకు ఇవ్వకపోతే నిరాహార దీక్ష: పవన్‌కల్యాణ్

సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐ విచారణకు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు రోజుల కర్నూలు పర్యటనకు వెళ్లిన ఆయన… సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ.. భారీ ర్యాలీ నిర్వహించారు. కోట్ల సర్కిల్‌లో హాజరైన జనంను ఉద్దేశించి ప్రసంగిచారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, చంపారని… దిశ ఘటన జరగకముందే ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పినా.. పట్టించుకోలేదని.. పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దిశ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్‌లో జనాలు ఎలా రోడ్లపైకి వచ్చారో… ప్రీతి ఘటనపై కూడా అందరూ రోడ్లపైకి వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్టీ బాలికకు అన్యాయం జరిగిపోతే స్పందించని సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నూలు జుడీషియల్‌ క్యాపిటల్‌ అంటున్నారు… సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే న్యాయ రాజధాని కట్టినా ప్రయోజనం ఏముందన్నారు.

రాయలసీమ బిడ్డకు అన్యాయం జరిగితే జగన్‌ ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. జగన్‌రెడ్డి ఎన్ని చట్టాలు తెచ్చినా… సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు అవన్నీ వ్యర్థమన్నారు. సుగాలి ప్రీతి అంశాన్ని సామాన్యులే తెరపైకి తెచ్చారని… ప్రజల్ని ముందుకు నడిపించే నాయకులే మాకు కావాలని ప్రకటించారు. రాయలసీమ అభివృద్ధిపైనా పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీ, సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాను ఊరుకోనన్నారు. దేశపు రక్తపు మూలాల్లోనే సెక్యులర్‌ భావాలున్నాయి.. ఇస్లాంను భారత్‌ నుంచి విడదీయలేరని ప్రకటించారు. మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే తిప్పికొట్టాలి పిలుపునిచ్చారు. దేశం అంతా ఆరాధించే క్రికెట్‌ టీమ్‌కు మైనార్టీని కెప్టెన్‌గా ఎంచుకున్న దేశం మనదన్నారు.

మూడు రాజధానులను పవన్ వ్యతిరేకిస్తున్నారంటూ.. కొంత మంది యువకులు.. ఆందోళన చేస్తే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో పవన్.. మూడు రాజధానుల అంశంపైనా స్పందించారు. హైకోర్టు వస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్న మాటను నమ్మనని స్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్లు కావాలి, నిధులు కావాలి.. సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగాలన్నారు. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటామంటూ.. కొంత మంది వ్యక్తులు హడావుడి చేశారు. వారికి మీడియా కూడా కవరేజీ ఇచ్చింది. అయితే.. అలాంటి వారంతా కలిపి పది మంది కూడా లేరు. పవన్ పర్యటనకు మాత్రం పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. గురువారం కూడా ఆయన కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close