భార‌తీయుడి సెట్లో ప్ర‌మాదం: నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా?

భార‌తీయుడు 2 సెట్లో భారీ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం, ముగ్గురు ప్రాణాలు కోల్పోవ‌డంతో చిత్ర‌సీమ షాక్‌కి గురైంది. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్‌, కాజ‌ల్ తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌డం వ‌ల్ల – అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీళ్ల‌లో ఎవ‌రికి ఏం జ‌రిగినా – చ‌ల‌న చిత్ర‌సీమ‌లో అది ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేని పెను విషాదంగా మారేది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాల్ని ఆదుకోవ‌డానికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ముందుకొచ్చింది.క‌మ‌ల్ ఇప్ప‌టికే కోటి రూపాయ‌ల సాయం ప్ర‌క‌టించారు. అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని తెలుస్తోంది. అస‌లు సెట్లో ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. చిత్ర‌బృందం నిర్ల‌క్ష్యం మూలంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌న్న ప్రాధ‌మిక నిర్దార‌క‌ణకు వ‌చ్చారు.

నిజానికి సినిమా సెట్స్‌లో క్రేన్‌ల‌ను వాడ‌డం స‌హ‌జ‌మే. అయితే… భారతీయుడు 2 సెట్లో వాడిన క్రేజ్ అతి భారీద‌ని తెలుస్తోంది. దాని స్టామినా 60 అడుగుల ఎత్తు వ‌ర‌కే అని తెలుస్తోంది. అయితే వంద అడుగుల ఎత్తు వ‌ర‌కూ తీసుకెళ్లి క్రేన్ ని ఉప‌యోగించ‌డం వ‌ల్లే బ్యాలెన్స్ కుద‌ర‌లేద‌ని, అస‌లు వంద అడుగుల ఎత్తున్న క్రేన్ వాడే అనుమతులే లేవ‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ విష‌య‌మై నిర్మాత‌ల్ని, ద‌ర్శ‌కుడిని సైతం పోలీసులు విచారించే అవ‌కాశం ఉంది. సెట్లో క‌నీస భ‌ద్ర‌త కోసం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లేం తీసుకోలేద‌ని, అందువ‌ల్లే ప్రాణ న‌ష్టం జ‌రిగింద‌ని తెలుస్తోంది. మ‌రి పోలీసులు ఎవ‌రిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close