మరో అక్రమ నిర్బంధం వివాదంలో ఏపీ పోలీసులు..!

అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసులపై హైకోర్టు ఇటీవలి కాలంలో రెండు సార్లు తీవ్రంగా మండిపడింది. ఓ సారి నేరుగా డీజీపీని హైకోర్టుకు పిలిపించగా.. మరోసారి ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించింది. ఇలా జరుగుతున్నా పోలీసులు మాత్రం… తమ మార్క్ .. అరెస్టులు ఆపడం లేదు. తాజాగా.. అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న జేఏసీకి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు ప్రైవేటు వాహనంలో వచ్చి తీసుకెళ్లారు. వంశీకృష్ణ… అమరావతి జేఏసీకి సంబంధించిన రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. ఆయనను పోలీసులు… నాలుగు రోజుల కిందట తీసుకెళ్లారు.

ఆయన కోసం.. అమరావతి జేఏసీ నేతలు.. అన్ని పోలీస్ స్టేషన్లను సంప్రదించినా.. తమకు తెలియదనే సమాధానం వచ్చింది. దాంతో.. అమరావతి జేఏసీ మీడియా సమావేశం పెట్టి.. వీడియో ఫుటేజీ విడుదల చేశారు. జేఏసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ భవనంలో ఉన్న సీసీ కెమెరాలో… వంశీకృష్ణను మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వాహనం కూడా ప్రైవేటు వాహనం. పోలీసులు.. వంశీకృష్ణ సమాచారం కూడా ఇవ్వడం లేదని… ఉద్యమకారులను వేధిస్తున్నారని.. పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని.. జేఏసీ కో కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు ప్రకటించారు.

ఉద్యమకారుల విషయంలో పోలీసులు ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా.. కీలకమైన కొంత మందిని టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లాజిస్టిక్స్ చూసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ వద్ద లేడని చెబుతూండటం కలకలం రేపుతోంది. వీడియో ఫుటేజీ స్పష్టంగా ఉండటంతో.. ఇదో వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టిన నేపధ్యంలో.. ఈ వంశీకృష్ణ అరెస్ట్ వ్యవహారం.. సంచలనం రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close