అంబానీ రాక వెనుక “గాలి స్టీల్ ఫ్యాక్టరీ” డీల్..!?

ఒక్క రాజ్యసభ సీటు కోసం దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా..? ఇదీ.. రెండు రోజులుగా.. అటు సోషల్ మీడియాలోనూ..ఇటు రాజకీయవర్గాల్లోనూ జరుగుతున్న చర్చ. అసలు చర్చల వివరాలేంటో బయట పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే.. ఈ డిమాండ్లు ఇలా ఉండగానే…కడప జిల్లాలో రిలయన్స్‌కు చెందిన ఉన్నతాధికారుల బృందం ఒకటి పర్యటించింది. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి కట్టాలని..కట్టలేకపోయిన బ్రహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీ స్థలాలను పరిశీలించింది. ఈ భూములను గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మునుషులు దగ్గరుండి చూపించారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం…కొన్ని వేల ఎకరాల భూమి ఉందని చూపించారు. అదే సమయంలో.. తాము ఉక్కు పరిశ్రమ కోసం.. నిర్మించిన గోడలు.. ఇతర నిర్మాణాలను చూపించారు. తెప్పించిన కొంత సామాగ్రి గురించి వివరించినట్లుగా తెలుస్తోంది.

బ్రహ్మణి స్టీల్స్ భూములను పరిశీలిస్తున్న బడా కంపెనీల ప్రతినిధులు..!

ఇప్పుడు రిలయన్స్ ప్రతినిధులు పరిశీలించారు కానీ.. గత కొద్ది రోజలుగా.. ఐదారు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు.. కడపకు వచ్చి బ్రహ్మణి స్టీల్స్‌కు చెందిన భూములను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొంత మంది అధికారులు కూడా.. ఆయా పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు .. భూమి గురించి.. వివరిస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో అత్యధికులు గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్తల కంపెనీలకు చెందినవారే. బ్రహ్మణి సంస్థ ప్రతినిధులు కూడా.. ఆ భూముల విలువని.. తాము చేయించిన పనుల విలువను..మొత్తంగా.. ఆ ప్రతినిధులకు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

భూములను గతంలోనే వెనక్కి తీసుకున్న ప్రభుత్వం..!

వైఎస్ హయాంలో 2007లో బ్రహ్మణి స్టీల్స్‌కు 10,760.66 ఎకరాలను ఎకరా రూ.18 వేల చొప్పున కేటాయించారు. జమ్మలమడుగు మండలం అంబవరంవద్ద వాణిజ్య విమానాశ్రయం కోసం మరో 3115 ఎకరాలు కేటాయించారు. ఈ భూమి ధరను ఎకరా రూ.25వేలుగా నిర్ణయించింది. 2009 నాటికి 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో తొలిదశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అయితే గోడలు తప్ప ఏమీ నిర్మించలేదు. కానీ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన 10760 ఎకరాల భూములను యాక్సిస్ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.350కోట్ల రుణం పొందింది. ప్లాంటుపై రూ.1350 కోట్లు ఖర్చు చేశామని బ్రహ్మణి ఇండస్ట్రీస్ కోర్టుకెళ్లింది.అయితే.. అక్కడ కేవలం రూ.171 కోట్లు ఖర్చు చేసి ఉంటారని పరిశ్రమల అధికారులు తేల్చారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ కేటాయింపులను రద్దు చేసారు. ఈ భూముల కేటాయింపు వెనుక అనేక అక్రమాలు జరిగాయని..ఓబులాపురం గనులు దోచుకునేందుకే.. ఈ పరిశ్రమను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.

మళ్లీ గాలికే కట్టబెట్టి.. ఆ తర్వాత బడా కంపెనీలకు అప్పగించబోతున్నారా..?

ప్రస్తుతం ఆ భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసినా కోర్టుల్లో కేసులు ఉండటంతో.. అక్కడ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రయత్నించలేదు. వివాదాస్పద భూముల్లో పెడితే పెట్టుబడిదారులు రారని ఆగిపోయాయి. కొద్దిరోజుల కిందట.. స్టీల్ ఫ్యాక్టరీకి జగన్ శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా వేరే చోట చేశారు. ఇప్పుడు.. రద్దు చేసిన ఆభూములను..మళ్లీ గాలి జనార్ధన్ రెడ్డికి అప్పగించి.. ఆయన ద్వారా ఇతర బడా కంపెనీల చేతులు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా.. ప్రస్తుత పరిణాలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close