సుకుమార్ శిష్యుడు… గ‌ట్టోడే

రాఘ‌వేంద్ర‌రావు, దాస‌రి నారాయ‌ణ‌రావు… లాంటి దిగ్గ‌జాలు డ‌జ‌న్ల కొద్దీ శిష్య‌బృందాలు త‌యారు చేసుకున్నారు. ఇప్ప‌టికీ వాళ్లు క‌నిపిస్తూనే ఉంటారు. కానీ న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు మాత్రం చిత్ర‌సీమ‌కు కొత్త ద‌ర్శ‌కుల్ని ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఎందుకంటే ఒక‌రి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి, సినిమా గురించి మెళ‌కువ‌లు నేర్చుకుని, ఆ త‌ర‌వాత తీరిగ్గా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఓపిక ఇప్పుడు ఎవ‌రికీ ఉండ‌డం లేదు. అంద‌రూ షార్ట్ ఫిల్మ్ బ్యాచులే. ఎవ‌రి ద‌గ్గ‌రా, ఏమీ నేర్చుకోకుండానే సినిమాలు తీసేసే స్థాయికి చేరుకున్నారు.

అయితే సుకుమార్ నుంచి మాత్రం ఓ శిష్యుడు వ‌స్తున్నాడు. త‌నే… బుచ్చిబాబు. త‌న శిష్యుడిపై న‌మ్మ‌కంతో… సుకుమారే ఈ చిత్ర నిర్మాణంలో భాగం కూడా పంచుకున్నాడు. ఆ ప్రాజెక్టే `ఉప్పెన‌`. చాలా కాలంగా ఈ సినిమా సెట్స్‌పై ఉంది. బ‌డ్జెట్ ఎక్కువైపోయింద‌న్న కామెంట్లూ వినిపించాయి. ఎమోష‌న్లు కూడా హెవీ డోసు లో ఉండ‌బోతున్నాయట‌. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌లైన రెండు పాట‌లూ చూస్తుంటే.. ఈ సినిమాకి హిట్టు క‌ళ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. సినిమాపై పాజిటీవ్ టాక్ అప్పుడే మొద‌లైపోయింది. యూత్‌ని క‌ట్టిప‌డేసే మెటీరియ‌ల్ ఈ సినిమాలో ఉంద‌ని అర్థ‌మౌతోంది. అందుకే తొలి సినిమా ఇంకా విడుద‌ల కాకుండానే బుచ్చిబాబుకు ఆఫ‌ర్లు వ‌చ్చేస్తున్నాయి. ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా స‌రే, మైత్రీ మూవీస్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదిరింద‌ట‌. అంతేకాదు.. యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించే చిత్రానికీ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. టీజ‌ర్ రాకుండానే ఇన్ని ఆఫ‌ర్లు అందుకున్నాడంటే, సినిమా విడుద‌లై, పాజిటీవ్ టాక్ వ‌స్తే… బుచ్చిబాబు మ‌హా బిజీ అయిపోతాడ‌న్న‌మాట‌. మొత్తానికి సుకుమార్ శిష్యుడు గ‌ట్టోడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close