జనసేన లేకపోతే తాను లేనట్లేనంటున్న పవన్..!

వైసీపీ నేతలు జనసేన కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారని..తమదైన రోజున గట్టి సమాధానమిస్తామని అప్పటి వరకూ భరిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రి హోటల్ షెల్టాన్‌లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా… పవన్ .. కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజమండ్రిలో తాను కవాతు చేసిన రోజు లక్షల మంది రోడ్లపైకి వచ్చారని.. కానీ ఓట్లు రౌడీలకు వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో తుఫాన్ వస్తే నాలుగు రోజులు అక్కడే ఉన్నాం.. పక్కనే పర్యటిస్తున్న జగన్‌ ఆ జిల్లా వైపు కూడా చూడలేదు.. అయినా అలాంటి వాళ్ళను గెలిపించారు అంటే తప్పు ఎవరిదని ప్రశ్నించారు. ధైర్యం నింపడానికే జనసేన పెట్టానని ప్రకటించారు.

దాడుల విషయంలో.. గుండె ధైర్యంతో నిలబడి యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. క్రిమినల్స్‌ మనల్ని పాలించాలనుకుంటే వైసీపీకి మద్దతివ్వండి .. సమసమాజ నిర్మాణం కోసం జనసేనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జనసేన ఉనికి కోల్పోతే పవన్‌కల్యాణ్‌ లేనట్లేనని భావోద్వేగంతో ప్రకటించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులపైనా స్పందించారు. బీజేపీ వారసత్వ పార్టీ కాదు.. అందుకే పొత్తు పెట్టుకున్నామని కొత్త సిద్ధాంతం చెప్పారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనే భావన ఏర్పడిందని. వ్యతిరేకం కాదని మైనార్టీలను ఒప్పించి పొత్తు పెట్టుకున్నానని పవన్‌ చెప్పుకొచ్చారు.

గతంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే.. కాస్త సందడిగా ఉండేది. బహిరంగసభ ఏర్పాటు చేసేవారు. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించడం లేదు. ఆయన సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ సారి స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ.. హోటల్‌లోనే కార్యక్రమం పూర్తి చేశారు. గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు జనసేన నేతల్లో కనిపించలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. పెద్దగా ఎక్కువ చోట్ల .. జనసేన నేతలు పోటీ చేయలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close