పవన్ ట్వీట్లు అలా కదిలించేస్తున్నాయంతే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరస్ బాధితుల కోసం ట్విట్టర్ ద్వారానే ప్రయత్నిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయన పలువురి గురించి ట్వీట్లు చేశారు. దానిపై క్విక్ రియాక్షన్ వస్తోంది. ఆయన తమిళనాడు సర్కార్ కు ట్వీట్ చేస్తే.. తక్షణం అక్కడ సీఎం స్పందిస్తున్నారు.. కేంద్రానికి ట్వీట్ చేస్తే.. కేంద్రమంత్రి స్పందిస్తున్నారు. కానీ ఏపీ సర్కార్‌కు చేసే ట్వీట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.. అది వేరే విషయం. తాజాగా ఆయన లండన్ హిత్రూ ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం.. పవన్ కల్యాణ్ కేంద్రానికి.. కేంద్ర విదేశాంగశాఖకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. వెంటనే.. ఆ శాఖకు చెందిన సహాయమంత్రి మురళీధరన్ పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ విషయంలో తాము వెంటనే స్పందించామని.. అక్కడ ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ విషయం మీడియాలో హైలెట్ అయింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు భావిస్తారనుకున్నారేమో కానీ.. మంత్రి సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌పోర్టులో ఉన్న విద్యార్థుల కోసం తాము కేంద్రవిదేశాంగ మంత్రితో మాట్లాడమని.. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేక శ్రద్ధతో వారి సంక్షేమం గురించి వాకబు చేస్తున్నారని చెప్పారు. అయితే.. ఇందులో ఎక్కడా పవన్ కల్యాణ్ ట్వీట్ గురించి.. ఆయన ట్వీట్ పై స్పందించిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి గురించి లేదు. మూడు రోజుల కిందట తమిళనాడు తీరంలో ఇరుక్కుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కోసం.. పవన్ కల్యాణ్ నేరుగా.. తమిళనాడు సీఎం కు ట్వీట్ చేశారు. ఆయన వెంటనే స్పందించి.. వారికి నిత్యావసర వస్తువులు అందించే ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ స్పందనపై.. గవర్నర్ తమిళిశై కూడా.. అభినందనలు తెలిపారు.

అయితే.. పవన్ కల్యాణ్ ఎన్ని ట్వీట్లు చేసినా.. ఏపీ సర్కార్ స్పందించడం లేదు. తెలుగు వారి సమస్యల కోసం.. పవన్ కేంద్రానికి, తమిళనాడు సర్కార్ కు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వానికి కూడా ట్వీట్ల ద్వారా సమస్యలను విన్నవించారు. కానీ వాటిని కనీసం పట్టించుకున్న వారు లేరు. అక్వా రైతులు, ఉద్యానరైతులు, వలస కూలీల సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లను.. సర్కార్ అసలు పట్టించుకోలేదు. వారి సమస్యను పరిష్కరించలేదు. వారు ఇప్పటికీ తంటాలు పడుతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close