భ‌లేభ‌లే మ‌హానుభావుడోయ్‌ మారుతి !

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు.. ఈ రెండు సినిమాలూ మారుతి కెరీర్‌ని మ‌లుపుతిప్పాయి. పెద్ద హీరోల దృష్టి మారుతిపై ప‌డేలా చేశాయి. రెండూ డిజార్డ‌ర్‌కి సంబంధించిన క‌థ‌లే. భ‌లే భ‌లే మగాడివోయ్ లో హీరోకి మ‌తిమ‌రుపు. మ‌హానుభావుడులో మాత్రం అతి శుభ్ర‌త‌. చిన్న కాన్సెప్టుల‌న్ని ప‌ట్టుకుని, దాని చుట్టూ వినోదాత్మ‌క క‌థ‌లు అల్లి సూప‌ర్ హిట్లు కొట్టాడు మారుతి. భ‌లే భ‌లే మగాడివోయ్ కి సీక్వెల్ తీస్తార‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. నాని కూడా మారుతితో ఈ సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మారుతి ఆలోచ‌న మారింది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు రెండు సినిమాల్నీ క‌లిపి – ఓ క‌థ రాయ‌బోతున్నాడ‌ట‌. అంటే ఈ క‌థ‌లో.. మ‌తిమ‌రుపు, అతి శుభ్ర‌త రెండు ల‌క్ష‌ణాలూ క‌నిపిస్తాయి.

“భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు ఈ రెండు సినిమాల్లోని హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని క‌లుపుకుంటే మ‌రొ గ‌మ్మ‌త్తైన క‌థ పుడుతుంద‌ని అనిపిస్తోంది. ఇంకా ఈ ఆలోచ‌న ప్రాధ‌మిక ద‌శ‌లోనే ఉంది. అయితే నా రాబోయే సినిమా పూర్తి వినోదాత్మ‌క‌మైన‌ది. క‌థ‌లో హీరోకి ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ ఉండ‌వు. ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యం త‌ప్ప‌” అని క్లారిటీ ఇచ్చారు మారుతి. రెండు సినిమాల్ని క‌లిపి సీక్వెల్ చేసే ఆలోచ‌న కొత్త‌దే. అందులో ఇద్ద‌రు హీరోలు (నాని, శ‌ర్వానంద్‌) న‌టిస్తే ఇంకా కొత్త‌గా ఉంటుంది. మారుతి ప్లాన్ కూడా అదే కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close