పవన్‌ని కలిసి జగన్‌పై విమర్శలు చేసిన బండి సంజయ్..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారని.. తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమవేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో కలిసి కార్యక్రమాలు చేపట్టడంపై సమాలోచనలు జరిపారు. గతంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు లక్ష్మణ్ కూడా కలిశారు. అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ అయిన తర్వాత లాక్ డౌన్ వివిధ కారణాల రీత్యా కలవలేకపోయారు. సోమవారం అవకాశం దొరకడంతో… పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి కలిశారు. రాజకీయాలపై చర్చించారు. వీరి మధ్య ముఖ్యంగా పోతిరెడ్డి పాడు అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

తాజాగా.. వారు తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న విధానాల కారణంగా.. ఇద్దరూ.. విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నరన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణని ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రామమందిరాన్ని రక్షించుకున్నట్లే తిరుపతిని కాపాడుకుంటామని ఆయన ప్రకటించారు. ఇతర మతాల ప్రార్థన మందిరాల జోలికి వెళ్ళే దమ్ము జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. హిందువులు గర్జిస్తే కేసీఆర్, జగన్‌ పారిపోతారని.. తిరుమలను కాపాడుకోవటానికి హిందువులు ముందుకురావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కల్యాణ్ కూడా అగ్రెసివ్‌గా స్పందించారు. కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య.. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించాలని కోరారు. వెంటనే రీట్వీట్ చేసిన పవన్.. ఏపీ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు పెట్టారు. తెలంగాణలో జనసేన కార్యక్రమాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఉన్నాయో.. లేవో అన్నట్లుగా ఉన్నాయి. అయితే.. ఏపీలో బీజేపీతో పొత్తులో పవన్ కల్యాణ్ ఉన్నందున.. తెలంగాణలో ఉన్న ఆయన ఫ్యాన్ బేస్ బీజేపీకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో.. అక్కడా నేతలు పరిచయాలు పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close