ప‌ర‌శురామ్ క‌థ మార్చేశాడా?

మ‌హేష్‌బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. లాక్ డౌన్ ఎత్తేశాక‌… మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. క‌థ పూర్త‌య్యింది. ఈ సినిమా కోసం `స‌ర్కారు వాటి పాట‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. దాదాపుగా ఈ టైటిలే ఖాయం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఓ సామాజిక అంశాన్ని క‌థ‌గా తీసుకుని, మ‌హేష్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు ఈ స్క్రిప్టు త‌యారు చేశాడు ప‌ర‌శురామ్‌. బ్యాంకుల ద‌గ్గ‌ర వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాల‌కు చెక్కేసే బ‌డా బాబుల బాగోతాల చుట్టూ సాగే క‌థ ఇదని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే టైటిల్ బ‌ట్టి చూస్తే మాత్రం ఇదో పొలిటిక‌ల్ సెటైర్ అనిపిస్తోంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే, ప‌ర‌శురామ్ క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేసిన‌ట్టు అర్థం అవుతోంది. నిజానికి ఈ క‌థ ప‌ట్టుకుని ఎప్పుడో మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు ప‌ర‌శురామ్. ఆ స‌మ‌యంలోనే మ‌హేష్ కొన్ని మార్పులు సూచించాడు. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని ప‌ర‌శురామ్ క‌థ‌ని కాస్త మార్చిన‌ట్టు అనిపిస్తోంది. పొలిటిక‌ల్ డ్రామాల‌కు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. మ‌హేష్ చేసిన `భ‌ర‌త్ అనే నేను` పొలిటిక‌ల్ డ్రామానే. అప్పులు ఎగ్గొట్టే వ్యాపార వేత్త‌ల క‌థ‌ని కాస్త పొలిటిక‌ల్ సెటైర్‌డ్రామాగా మార్చేశాడు ప‌ర‌శురామ్. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close