రాజ‌శేఖ‌ర్‌తో ‘మెగా’ ప్యాచ‌ప్‌

చిరంజీవి – రాజ‌శేఖ‌ర్‌.. వీరిద్ద‌రిదీ టామ్ అండ్ జెర్రీ అనుబంధం. ఇది వ‌ర‌కు బాగానే ఉండేవారు కానీ.. చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీ పెట్టాక‌, ఆ పార్టీపై రాజ‌శేఖ‌ర్ కామెంట్లు చేశాక‌… ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ వ‌చ్చేసింది. ఆ గ్యాప్ పూడిన‌ట్టే పూడి.. పెరిగిపోవ‌డం అల‌వాటుగా మారింది. మొన్న‌టికి మొన్న `మా` వివాదం విష‌యంలో… ఓ ప్రెస్ మీట్‌లో, ఛాన‌ల్స్ అన్నీ లైవ్‌లో ఉండ‌గా, చిరంజీవి స‌మ‌క్షంలో.. రాజ‌శేఖర్ ఎర్ర‌జెండా ఎగ‌రేయ‌డం, దాంతో.. రాజ‌శేఖ‌ర్‌పై క్ర‌మ‌శిక్షణ చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని చిరంజీవి `మా` పెద్ద‌ల్ని కోర‌డం.. చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అప్ప‌టి నుంచీ.. ఈ గ్యాప్ ఇంకాస్త పెద్ద‌దైంది.

ఇప్పుడు ఈ గ్యాప్‌ని పూడ్చ‌డానికి అల్లు అరవింద్ ముందుకొచ్చిన‌ట్టు స‌మాచారం. రాజశేఖ‌ర్‌తో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇది వ‌ర‌కు ప‌లాస ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌కి గీతా ఆర్డ్స్ అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. గీతా ఆర్ట్స్ అంటే…. ఓర‌కంగా చిరంజీవి సొంత సంస్థ‌. సో.. `మా మ‌ధ్య ఏం లేదు…` అని చెప్పుకోవ‌డానికి అటు చిరంజీవికి, ఇటు రాజ‌శేఖ‌ర్‌కీ ఇదో చ‌క్క‌టి అవ‌కాశం. నిజానికి గీతా ఆర్ట్స్ యువ హీరోల‌తో, ఫామ్ లో ఉన్న హీరోల‌తో సినిమాలు చేస్తుంటుంది. తొలిసారి ఆ నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న పెట్టి, ఫ్లాప్ హీరో రాజ‌శేఖ‌ర్ హీరోగా సినిమా చేయ‌డంలో ఆంతర్యం ఫిల్మ్‌న‌గ‌ర్ పెద్ద‌ల‌కు అర్థం కావ‌డం లేదు. నిజంగా గీతా ఆర్ట్స్ లో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తే.. మెగా ప్యాచ‌ప్ దాదాపు స‌క్సెస్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close