సరిహద్దు జిల్లాల్లో తప్ప పడిపోయిన తెలంగాణ మద్యం అమ్మకాలు..!

తెలంగాణ సర్కార్‌కు మద్యం అమ్మకాల కిక్ అందడం లేదు. మామూలు రోజుల్లో వచ్చే ఆదాయం కూడా రావడం లేదు. మూడు జిల్లాల్లో మినహా అన్ని చోట్లా మద్యం అమ్మకాలు సగానికి సగం పడిపోయినట్లుగా తెలుస్తోంది. దానికి కారణం జనం దగ్గర డబ్బులు లేకపోవడమే. లాక్ డౌన్ ఎత్తేసే సమయానికి ఎండాకాలం ఫుల్ స్వింగ్‌లోఉంది. సాధారణంగా.. అలాంటి సమయంలో..బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ అనూహ్యంగా.. బీర్ల అమ్మకాలు 44 శాతం మేర తగ్గిపోయాయి. గత ఏడాది 2019 జూన్ ఒకటో తారీఖు నుంచి 17 వరకు సుమారు 30 లక్షల 20 వేల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది 2020 జూన్ ఒకటి నుంచి 17 తేదీ వరకు 17 లక్షల కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 44 శాతానికి బీర్ల అమ్మకాలు పడిపోయాయి.

ఇతర లిక్కర్ అమ్మకాలు కూడా అదే స్థాయిలో పడిపోయాయి. ప్రజలకు సంపాదన పడిపోవడం.. మద్యం అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ.. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. అదే సమయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా అమ్మకాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిన మొదటి రెండు రోజులు.. భారీగా కొనుగోలు చేసినా తర్వాత మాత్రం మద్యం దుకాణాల వద్ద జనం కనిపించడం లేదు.

అయితే..ఏపీతో సరిహద్దు ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం అమ్మకాలు ఇతర చోట్లతో పోలిస్తే..దాదాపుగా 40 శాతం మేర అధికంగా ఉన్నాయి. ఏపీలో అన్ని బ్రాండ్లు అమ్మడం లేదు. పైగా ధర కూడా చాలా ఎక్కువ. దాంతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనుగోలు చేసి.. ఏపీకి తరలించడం ఎక్కువయింది. దాంతోఆ మూడు జిల్లాలకు.. ఏపీ మార్కెట్ కలసి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close