తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స..!

వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. టెస్టులు కూడా.. ఉచితంగా చేయాలని ప్రైవేటు ఆస్పత్రులకు దిశానిర్దేశంమ చేస్తోంది. ముందుగా మూడు భారీ ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ఆస్పత్రులను.. ఈ దిశగా.. ఉచిత చికిత్స ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌, మమతా మెడికల్ కాలేజ్‌, కామినేని మెడికల్ కాలేజీల్లో మొదట కరోనా టెస్ట్‌లు, కరోనా చికిత్సలు ఉచితంగా అందించనున్నారు.

ముందు ముందు భారీ ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులతోపాటు.. కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా.. ఈ ఉచిత కరోనా టెస్టులు, చికిత్స విధానాన్ని విస్తరించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ ఉచిత టెస్టులు, చికిత్స విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. తెలంగాణ సర్కార్.. కరోనా విషయంలో… పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తోందని.. హైకోర్టు తీవ్రంగా మండిపడిన తర్వాతి రోజే… ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సరైన కరోనా వైద్యం అందడం లేదంటూ.. హైకోర్టులో అదే పనిగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. టెస్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అదే సమయంలో.. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. హోం ఐసోలేషన్ అంటూ.. ఇంటికే పంపించేస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరదామనుకునేవారికి అవకాశం దక్కడం లేదు. ఏ ఆస్పత్రి చేర్చుకోవడం లేదు. బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వీఐపీలు వస్తే క్షణాల్లో వారిని చేర్చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటిపై… తెలంగాణలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కదిలింది. అయితే.. ప్రకటనలకే కాకుండా… సీరియస్‌గా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ.. టెస్టులు, చికిత్స ఉచితంగా అందేలా చూడాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వానికి ఎక్కువగా వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close