మూడు రాజధానులపై హైకోర్టు స్టేటస్ కో ..!

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం, గెజిట్ విడుదలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలుకు 10 రోజుల సమయం కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దానికి అంగీకరించిన కోర్టు… అప్పటి వరకూ..స్టేటస్ కో అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు వాదించారు. దీనిపై ప్రభుత్వం రిప్లై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ బిల్లులపై యథాతథ స్థితి కొనసాగించడం అంటే.. ఆ బిల్లుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అంటే.. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ…, ఆ బిల్లుల ఆధారంగా… రాజధాని తరలించడం సాధ్యం కాదు.

మండలిలో సెలక్ట్ కమిటీలో ఉన్న బిల్లుల్నే ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలోపెట్టి ఆమోదింప చేసుకుని చట్ట రూపంలోకి తీసుకు వచ్చిందని… ఇది రాజ్యాంగ విరుద్దమని.. విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయనిపుణులు కూడా అదే చెబుతున్నారు. మూడురాజధానులు అనేది… విభజన చట్టాన్ని అధిగమించేలా ఉందని.. హైకోర్టు ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం ప్రభుత్వానికి.. లేదని.. ఆ అంశంపై చట్టం చేయలేరని అంటున్నారు. ఈ అభ్యంతరాలు అన్నీ వివరిస్తూ.. హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

గవర్నర్ ఆమోదించినా… ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా… న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉంటే… చట్టాలను సైతం.. కొట్టి వేసే హక్కు కోర్టులకు ఉందని వాదిస్తున్నారు. ఇప్పుడు… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలు న్యాయసమీక్షకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు విచారణ ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close