మార్చి 6న రాజమండ్రిలో బీజేపీ బహిరంగ సభ

రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. మార్చి ఆరవ తేదీన రాజమండ్రిలో నిర్వహించబోయే ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ జైన్ తెలిపారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నిటి కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగింది కనుక రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన మీడియాకి తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సభలో వక్తలు రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని ఆయన తెలిపారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడిని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరారు. కానీ వారి నుండి ఆయనకు నిర్దిష్టమయిన హామీ ఏదీ లభించలేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాత్రం రైల్వే జోన్ ఏర్పాటుకి సానుకూలంగా స్పందించారు. కానీ అది ఎప్పుడు ఏర్పాటు అవుతుందో తెలియదు. మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్యాకేజి వంటి ప్రధానమయిన హామీలనన్నిటినీ అమలుచేసి ఉండి ఉంటే ఈ బహిరంగ సభకు మంచి ప్రజాధారణ ఉండేది కానీ వాటిని ఇంతవరకు అమలు చేయకపోవడం వలన ఈ బహిరంగ సభలో పాల్గొనబోయే బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఆ విషయంలో ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోక తప్పదు. ప్రజలకు ఇచ్చిన హామీలను రెండేళ్ళయినా అమలు చేయకుండా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో ఇటువంటి బహిరంగ సభలు నిర్వహించినా ఆశించిన ప్రయోజనం దక్కక పోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close