అప్పుడు కాదు…లాక్‌డౌన్‌లోనే రథం సింహాల చోరీ..!

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వెండి రథానికి ఉన్న రథాలు ఈ ఏడాది మార్చి తర్వాతనే చోరీ అయ్యాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఆలయ అధికారులకూ ఈ విషయంపై స్పష్టత ఉంది. కానీ.. రాజకీయం కోసం తప్పదన్నట్లుగా గత ఏడాది ఉగాది ముగిసిన తర్వాత రథానికి పట్టా కట్టేసి ఉంచామని.. తెరిచి చూస్తే.. వెండి విగ్రహాలు లేవని ఫిర్యాదు చేశారు. కానీ అసలు విషయం మాత్రం పోలీసులకు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ఉగాది ఉత్సవాల కోసం.. రథాన్ని సిద్ధం చేయాలనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోయినప్పటికీ.. రధానికి మెరుగులుపట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఓ సంస్థకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఆ సంస్థ మరో వ్యక్తికి పని అప్పగించింది. ఇప్పుడా వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో రధానికి మెరుగులు పట్టించినట్లుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ విగ్రహాలు.. తమ హయాంలో పోయాయంటే… ప్రజలు అనుమానాలు భరించలేమనుకున్నారో.. ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేమనుకున్నారో కానీ.. మంత్రి వెల్లంపల్లి మొదటగా… ఆ విగ్రహాలు టీడీపీ హయాంలోనే పోయాయని ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ఆలయ, ఈవో చైర్మన్‌లు రకరకాల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఈవో అయితే.. అసలు రథానికి నాలుగు సింహాల ప్రతిమలున్నాయా..? రెండే ఉన్నాయా..? అసలు అవి వెండివేనా..?.. స్టోర్ రూమ్‌లో ఉండి ఉంటాయని.. రకరకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో మాత్రం.. తప్పు ఎప్పుడు జరిగిందో.. ఎక్కడ జరిగిందో ఓ క్లారిటీకి వస్తున్నారు.

పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా కొండపై ఆలయ అభివృద్ధి పనులు కొన్ని జరిగాయి. ఆ పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. వారు కొండపైనే ఉండి పనులు చేశారు. పదిహేు రోజుల కిందట వెళ్లిపోయారు. వారిలో ఎవరైనా తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు పోలీసుల్లో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే.. నాలుగో సింహపు ప్రతిమను కూడా తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అది వెల్డింగ్ చేసి అతికించడంతో తీయడం సాధ్యం కాలేదు. తీయడానికి ప్రయత్నించి పెద్ద కన్నం పెట్టిన విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చోరీ చేసిన మూడు సింహాల ప్రతిమలు మాత్రం బోల్టులతో బిగించారు. అవి సులువుగా రావడంతో తీసుకెళ్లిపోయారు.

రాజకీయంగా వైసీపీ నేతలు… గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా.. అదంతా కేవలం గందరగోళం రేపడానికేనని తాజా పరిణామాలు స్పష్టమవుతున్నాయి. లాక్‌డౌన్ విధించిన తర్వాతనే… కొండపైన ఉండేవారు.. మాత్రమే.. ఈ సింహాలను దొంగతనం చేయడం సాధ్యమని గుర్తించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఆలయ అధికారులు సహకరించడానికి తటపటాయిస్తూండటంతో పోలీసులకు కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close