ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న .. తెలంగాణకు రమణే..!

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ జాతీయ కమిటీల్ని పునర్‌వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. 27 మందితో టీడీపీ కేంద్ర కమిటీ.. ఇరవై మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీలో ముగ్గురు మహిళలకు ఉపాధ్యక్ష పదవులు కల్పించారు. పొలిట్ బ్యూరో పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, లోకేష్, నిమ్మల , వర్ల రామయ్య సహా.. మరో నలుగురికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణ రాజీనామా చేసిన గల్లా జయదేవ్‌కు చోటు కల్పించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ, ఫరూక్‌, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర ,గుమ్మడి సంధ్యారాణిలకు చోటు కల్పించారు. అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు మరో వైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణ వద్దంటూ.. కొంత మంది నేతలు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. రమణనే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 31 మందితో తెలంగాణ టీడీపీ కమిటీని ఏర్పాటు చేశారు.

అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించడంలో కాస్త ఆలస్యం జరగడంతో.. ఇతర టీడీపీ నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ జాతీయ కమిటీల కూర్పు కోసమే అగినట్లుగా టీడీపీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు అచ్చెన్నను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close