కేసీఆర్ పిలుపు… విరాళాల వెల్లువ..!

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంది . హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. పది కోట్ల సాయం ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం రూ. పదిహేను కోట్లను సాయంగా ప్రకటించింది. తెలంగాణకు వరదలు రావడం బాధాకరమని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి. కేసీఆర్ ఆయా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

అదే సమయంలో సీఎం కేసీఆర్ పిలుపునకు సినీ పరిశ్రమ ఒక్క ఉదుటున కదిలింది. కేసీఆర్ పిలుపునివ్వక ముందే నందమూరి బాలకృష్ణ రూ. కోటిన్నర సాయం ప్రకటించారు. కేసీఆర్ పిలుపు తర్వాత మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. కోటి ప్రకటించారు. నాగార్జున, జూ.ఎన్టీఆర్ రూ.50 లక్షలు, హీరో విజయ్‌దేవరకొండ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. విజయ్ దేవరకొండ.. తాను సీఎంఆర్ఎఫ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన రిసీప్ట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సహాయక చర్యల కోసం రూ.550 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వానికి.. అక్కినేని నాగార్జున అభినందనలు తెలిపారు. హారికా హాసిని క్రియేషన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు, డైరెక్టర్లు అనిల్ రావిపూడి, హరీష్‌శంకర్ రూ.5 లక్షలు చొప్పున ప్రకటించారు. మరికొంత మంది కూడా ప్రకటించే అవకాశం ఉంది.

మరో వైపు భారీ వ‌ర్షాలతో న‌ష్టపోయిన ప్రజ‌ల‌ను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెల‌ల జీతాన్ని సీఎం స‌హాయ‌నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఎడతెగని వర్షం పడుతోంది. రోజూ ఏదో ఓ చోట భారీ వర్షం పడుతోంది. వందల కాలనీలు ఇప్పటికీ నీటి ముంపులోనే ఉన్నాయి. సాధారణం ఎంత పెద్ద వర్షం వచ్చిన వరద ఒక్క రోజులో తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close