క్రెడిట్ బీజేపీకే..! ఏపీకి కేంద్రబృందం..!

వరదలు వచ్చాయి…పోయాయి. వరదలు వచ్చిన వారం రోజులకు సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. రెండు వారాలకు కేంద్ర బృందం ప్రకటన ఉంటుందని ప్రకటన వచ్చింది. మూడు వారాలకు వారు వచ్చి.. పరిశీలిస్తే.. ఆ తరవాత కుదిరినప్పుడు సాయం చేస్తారు. అయితే.. ఏపీ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా కేంద్రం మాత్రం ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. వరద నష్టం అంచనా వేసి… సాయం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆలస్యంగా అయినా కాస్త రాజకీయంగా ఆలోచించారు. పొరుగున ఉన్న తెలంగాణలో కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి వరదల సెగ తగిలింది.

అంత పెద్ద వరదలు వచ్చి హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడుతూంటే.. కేంద్రం నుంచి సాయం రావడం లేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడంతో .. కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర బృందాన్ని తెలంగాణకు పిలిపించి.. నష్టాన్ని ఎన్యూమరేషన్ చేయించారు. ఇక సాయం చేస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. ఏపీకి ఆ కేంద్ర బృందం కూడా అదీ గతీ లేదు. దీంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఏపీ సర్కార్ ఎలాగూ అడగడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలే రంగంలోకి దిగారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రితో వర్చువల్ భేటీ ఏర్పాటు చేసుకుని.. కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఏపీలో ప్రభుత్వం ఉన్నా.. లేనట్లే అనుకోవాలని.. కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. సరే అని.. కేంద్ర వ్యవసాయ మంత్రి… కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. మరో వారంలో వారి పర్యటన ఉండొచ్చు.

కానీ వరదలు వచ్చి మూడు వారాలు అయిపోయిన తర్వాత వారికి ఎలాంటి నష్టం కనిపిస్తుందనేది సందేహమే. ఇప్పటికే కేంద్రం ఇచ్చే సహాయంపై సందిగ్ధం నెలకొంది. గతంలో హుదూద్ వచ్చినప్పుడు.. రూ. వెయ్యి కోట్లు తక్షణ సాయం ప్రకటించారు మోడీ. కానీ నికరంగా వచ్చిన సాయం మాత్రం రూ. 750 కోట్లేనని ప్రభుత్వ వర్గాలుచెబుతూంటాయి. అలాంటిది.. వరదలకు పంట నష్టం జరిగితే.. ఎంత ఇస్తారనేది సందేహమే. కానీ రాజకీయంగా మాత్రం.. బీజేపీ లీడర్లు ఓ స్కోర్ చేయడానికి ఈ కేంద్ర బృందం ఉపయోగపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close