పోలవరం కట్టలేమన్న అనిల్..!

పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రం ఆమోదించిన పాత ధరలకు తాము కట్టలేమని.. జనవనరుల మంత్రి అనిల్ కుమార్ మీడియా ముందు తేల్చి చెప్పేశారు. సహాయ, పునరావాసాలకే రూ. 30వేల కోట్లు అవుతుందని… కేంద్రం ఇస్తామంటున్న నిధులతో ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతుందని ప్రశ్నించారు. అనిల్ స్పందన చూస్తూంటే.. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి.. కేంద్రమే కట్టాలని.. పూర్తిగా కాడి దించేసే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారగానే హడావుడిగా.. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చేసిన ప్రభుత్వానికి ప్రస్తుతం.. కేంద్రం ఇచ్చిన షాక్‌తో.. మొత్తం ఆ ప్రాజెక్ట్‌ను కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

దేశంలో ఇప్పటికి ఎన్నో జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ వేటికీ.. కేంద్రం నిధులు కేటాయిందు. దశాబ్దాల తరబడి ఆ ప్రాజెక్టులు నత్త నడకన సాగుతూ ఉంటాయి. కానీ నీతి ఆయోగ్ సూచనతో.. నిర్మాణ పర్యవేక్షణను తీసుకున్న గత ప్రభుత్వం.. శరవేగంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. నిధుల కొరత వెంటాడుతున్నా.. బడ్జెట్‌లో కేటాయించి మరీ.. పనులు చేయించింది. గత ప్రభుత్వం చేయించిన పనులకు సంబంధించి.. ఈ ప్రభుత్వానికి .. రూ. మూడు వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ కూడా వచ్చింది.

ఆ నిధులను సర్కార్ మరో దానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు… కేంద్రంపై ఒత్తిడి చేసి. .. పోలవరం టెక్నికల్ కమిటీ ఆమోదించిన రూ. 50వేల కోట్ల ప్రతిపాదనలను ఆర్థిక శాఖతో ఆమోదింపచేసుకోలేక… పూర్తిగా చేతులెస్తోంది. టీడీపీదే తప్పని.. పోలవరంను అటకెక్కించడానికి ఏపీ సర్కార్ రెడీ అయినట్లుగా.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close