మంగళగిరి ఎమ్మెల్యే బకరా అయ్యారట..!

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఓ విత్తన కంపెనీ చేతిలో బకరా అయ్యారు. అది ప్రైవేటు కంపెనీ అయితే ఎలాగోలా రాజకీయం చేయవచ్చు .. కానీ ఏపీ ప్రభుత్వ అధీనలో ఉన్న ఏపీ సీడ్స్ చేతిలో ఆయన బకరా అయ్యారు. ఆ కథపై ఇప్పుడు ఏపీలో రచ్చబండ మీద చర్చ అవుతోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయం చేస్తారు .. అలాగే అప్పుడప్పుడూ వ్యవసాయం చేస్తారు. ఎడ్లు లేనట్లుగా.. ట్రాక్టర్ లేనట్లుగా.. ఆయనే కాడి భుజాన వేసుకుని దున్నుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ దర్శనమిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే.. ఆయన వ్యవసాయం కూడా చేస్తారని అనుకోవాలి. గుంటూరు శివారులో ఓ గ్రామంలో తనకు ఉన్న పధ్నాలుగు ఎకరాల పొలంలో ఆయన వరి పంట వేశారు. ఇందులో వరి కంకులు రాలేదు. దీంతో తాను నష్టపోయానంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధికారులు కూడా హుటాహుటిన స్పందించారు. ఆయన పొలాన్ని పరిశీలించారు. మొలకలు వచ్చినా.. గింజలు రాలేదని.. గుర్తించారు. వెంటనే.. చర్యలకు ఉపక్రమించారు. విషయం ఏమిటంటే.. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ సీడ్స్… ఈ విత్తనాలు స్వయంగా సిద్ధం చేయలేదు. ఇతర ప్రైవేటుకంపెనీల నుంచే సేకరిస్తుంది. అలా…ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనుగోలు చేసిన.. విత్తనాలను నంద్యాలకు చెందిన మంజీరా సీడ్స్ అనే కంపెనీ సరఫరా చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు తన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ తీరుపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఇప్పటి వరకూ ఏపీ సీడ్స్ నుంచి ఆ కంపెనీ విత్తనాలను కొనుగోలు చేసిన రైతులెవరూ.. తమకు నకిలీ విత్తనాలు సరఫరా చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా… ఎక్కడా బయటకు రాలేదు. ఒక్క ఆళ్లకు మాత్రమే నకిలీ విత్తనాలు వచ్చాయా..? లేక రైతులందర్నీ అంతే ముంచారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఒక వేళ ఆళ్లకే అలాంటి పరిస్థితి వస్తే.. బహుశా.. ఆ మంజీరా సీడ్స్ అనే కంపెనీ… ఏ టీడీపీ నేతకో.. లేదా ఆ పార్టీ సానుభూతిపరుడికో చెందినది అయి ఉండవచ్చని.. అనుకోచవచ్ని.. కొంత మంది సెటైర్లు కూడా ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close