ఈ సారి కూడా వ్యతిరేక మీడియాకు నో పర్మిషన్..!

అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. అయితే మీడియాకు మాత్రం అందరికీ పర్మిషన్ దొరకడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని టీవీ చానళ్లను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానిచ్చేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం సిద్దంగా లేరు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ అనుకూల మీడియాగా పేరున్న వాటికి మాత్రం కేవరేజీకి చాన్సిస్తున్నారు. అసెంబ్లీ లైవ్‌ను కూడా.. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానళ్లు ఇవ్వకుండా… నిషేధం విధించారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగా… ఒక్క నిమిషం పాటు.. మీడియా పాయింట్‌లో ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న దాన్ని ప్రసారం చేశారు.

అది నిబంధనలకు విరుద్ధమని.. చెబుతూ అప్పటి నుండి… ఆ చానళ్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ చానళ్ల ప్రతినిధుల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వడం లేదు. మీడియా సంఘాలు ఓ ప్రకటన చేసి సైలెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు కూడా స్పీకర్ అనుమతి ఇవ్వడం లేదు. నిజానికి సెషన్‌లో తీసుకున్న నిర్ణయాలు ఆ సెషన్ వరకే పరిమితం చేస్తారు. మీడియా విషయంలో… వివరణ తీసుకుని .. వదలిస్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఓ చిన్న తప్పును పట్టుకుని.. మీడియాను అనుమతించకపోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని చానళ్లను నియంత్రించి.. తమకు మద్దతుగా ఉండే వారి మీడియాకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.

అయితే.. తాము చెప్పిందే వేదమన్నట్లుగా ఉన్న పాలకులు.. మీడియాపై కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై శాసనమండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు.. శాసనండలి చైర్మన్‌కు కు లేఖ రాశారు. అన్ని మీడియా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. నిజానికి శాసనమండలి చైర్మన్ .. శాసనమండలి ప్రోసీడింగ్స్ అన్ని మీడియా సంస్థలకు ఇవ్వాలని ఆదేశించినా.. స్పీకర్ అధీనంలో ఉద్యోగులు పడనీయడం లేదు. దీంతో ఆయన ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. ఈ సారి మాత్రం మీడియా సంస్థల నుంచి.. తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close