ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిజర్వ్ బెంచ్‌ను సిఫార్సులతో నింపేస్తున్నాయా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం అంటే.. జాతీయ జట్టుకు ఆడినట్లే. కనీసం ఏదైనా ఫ్రాంచైజీ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంటే చాలన్నట్లుగా చాలా మంది యువ ఆటగాళ్ల కోరిక. ఫ్రాంచైజీలన్నీ ఇప్పుడు ఈ యువ ఆటగాళ్ల బెర్తులను సిఫార్సుల కోసం కేటాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐపీఎల్ జట్టులో ఇరవై ఐదు మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆటగాడి కనీస వేలం ధర రూ.20 లక్షలు. ముఖ్యమైన ఆటగాళ్ల కోసం రూ. కోట్లు వెచ్చిస్తున్న టీములు.. ఎక్కువ మందిని ఈ రూ.20 లక్షల కేటగిరిలో తీసుకుని నెట్స్‌లో ప్రాక్టీస్‌కో… మరో విధంగానో ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ఆటగాళ్లందర్నీ మెయిన్ టెయిన్ చేయడం కష్టమవుతుందని చాలా కాలంగా టీములు సణుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది అ సణుగుడు కన్నా… సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చి.. రెండు విధాలుగా లాభం పొందే ప్రయత్నాలు చేసినట్లుగా సెటైర్లు పడుతున్నాయి.

ముంబై ఇండియన్స్ టీమ్.. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్ వద్దనే తీసుకుంది. అంతకు ముందు ఎవరూ తీసుకోలేదు. ఎవరూ తీసుకోలేదు కాబట్టి ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎంఐ టీంకు.. సచిన్ టెండూల్కర్ మొదటి నుంచి పెద్ద దిక్కుగా ఉన్నారు. అర్జున్ ఏ స్థాయి క్రికెట్‌లోనూ గొప్పగా ప్రదర్శన చేసిన దాఖలాలు లేవు. సచిన్ టెండూల్కర్‌కు ప్రుత్సోత్సాహం కల్పించడానికే ముంబై ఇండియన్స్ ఓనర్లు రిలయన్స్ అంబానీలు అర్జున్ టెండూలర్కర్‌కు.. తమ ప్లేయర్ల ఇరవై ఐదు మంది కుర్చీల్లో ఒకటి అప్పగించారని విశ్లేషించడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అదే సమయంలో చెన్నై క్రికెట్ టీం .. కడపకు చెందిన హరి శంకర్ రెడ్డి ఆంధ్రా రంజీ ప్లేయర్‌ను రూ.20 లక్షల క్యాప్‌లో బేస్ ప్రైస్‌కు తీసుకుంది. హరి శంకర్ రెడ్డిని కూడా ఎవరూ తీసుకోలేదు.

నిజానికి 25 మంది ఆటగాళ్ల జాబితాలో పదకొండు మంది మాత్రమే తుది జట్టులో ఉంటారు. ఒకరిద్దరు తప్ప… పెద్దగా టోర్నీ మొత్తం మార్పులు ఉండవు. ఈ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అసలు చోటు దక్కడం కూడా కష్టమే. హరిశంకర్ రెడ్డి గట్టి ప్రదర్శన చేసినట్లుగా ఎప్పుడూ మీడియాలో కూడా రాలేదు. అయితే అనూహ్యంగా చోటు దక్కింది. ఆయనకు ఏపీ అధికార పార్టీ నుంచి మద్దతు ఉందని.. చెన్నై టీం సీఎస్కే ఓనర్స్ అయిన ఇండియా సిమెంట్స్‌తో ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలతోనే ఓ రూ. ఇరవై లక్షల క్యాప్‌లో హరి శంకర్ రెడ్డికి చోటు కల్పించారని తమిళనాడులో దుమారం రేగుతోంది.

నిజానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు… తమ గెలుపు అవకాశాల కోసం.. ఏ రాష్ట్ర జట్టు అయినప్పటికీ.. ప్రధాన ఆటగాళ్లలో ఆ రాష్ట్ర ఆటగాళ్లు ఉన్నారో లేదో చూసుకోకుండా ఎంపిక చేసుకుంటాయి. కానీ రిజర్వ్ బెంచ్ దగ్గరకు వచ్చే సరికి… ఐపీఎల్‌ టీంకు చెందిన రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లలో ప్రతిభావంతులకు చాన్స్ ఇస్తూంటారు. ఇదే విషయాన్ని తమిళనాడులోని క్రికెట్ ప్రేమికులు గుర్తు చేస్తున్నారు. పెరియస్వామి అనే యువ బౌలర్ గణాంకాలను వివరిస్తూ.. ఏ విధంగా హరి శంకర్ రెడ్డి మెరుగైన ఆటగాడో చెప్పాలని అంటున్నారు. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించాలని సీఎస్‌కే టీంకు సలహాలిస్తున్నారు. వాళ్ల వల్ల ఎలాగూ ఉపయోగం ఉండదు కాబట్టి.. తమ వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చే సిఫార్సులకు కేటాయిస్తున్నట్లుగా వీరి ఎంపిక ద్వారా తెలుస్తోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close