బెంగాల్‌లో బీజేపీ ఉచిత హామీల వరద..! నమ్ముతారా..?

బెంగాల్ ప్రజలను ఆకట్టుకుని ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రుణమాఫీ కూడా ఉంది. రైతులకు రూ. పద్దెనిమిది వేల చొప్పున రుణమాఫీ చేస్తామని అందులో హామీ ఇచ్చారు. అదే కాదు.. ఇంటికో ఉద్యోగం అని ఆచరణ సాధ్యం కాని హామీ కూడా ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను హోంమంత్రి అమిత్ షా స్వయంగా విడుదల చేశారు. అందులో ఉన్న హామీలను చూసి… బెంగాలీలు ఆశ్చర్యపోతున్నారో లేదో కానీ.. చాలా మందికి గతంలో బీజేపీ ఇచ్చిన బెంచ్ మార్క్ హామీలు గుర్తుకు వస్తున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని .. మొదటి సారి ఎన్నికల్లో గెలవక ముందు మోడీహామీ ఇచ్చేవారు. అన్నిప్రచార సభల్లో చెప్పేవారు.

చివరికి నల్లధనం వెనక్కి తేలేదు… ఎవరికీ పైసా ఇవ్వలేదు. ఎన్నో చెబుతూంటాం కానీ అన్నీ చేస్తామా అని ఓ సందర్భంలో అమిత్ షా .. ఈ హామీ గురించి వ్యాఖ్యానించారు. అదే్ సమయంలో… ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని.. కూడా హామీ ఇచ్చారు. ఇచ్చారో లేదో కానీ.. నోట్ల రద్దు, లాక్ డౌన్ వల్ల ఆరేంజ్ లో ఉద్యోగాలు పోయాయని మాత్రం చెప్పుకున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి అప్పట్లో చేసిన ప్రచారాలు.. ఇప్పుడుచేస్తున్న పనులు అన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ భారతీయజనతా పార్టీ బెంగాల్‌లో ఏమాత్రం మొహమాట పడకుండా పెద్ద ఎత్తున ఉచిత హామీలు గుప్పించింది. అమలు చేస్తారా లేదా అన్నది తర్వాతి సంగతి… లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసినట్లేగా వేస్తే చాలన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రచార వ్యూహంలోనూ బీజేపీ తడబడుతోంది.

సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తోంది. ఇక టీవీ ప్రచార కార్యక్రమాలు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగాల్ ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మార్చుకోవడానికి అసాధ్యమైన విషయాలను మోడీ మాత్రమే చేయగలరంటూ ప్రచారం చేసుకోవండ.. ప్రజల్ని విస్తుపరిచేలా చేస్తోంది. అయినా బీజేపీ మాత్రం తన దారిలోనే తాను వెళ్తోంది. బెంగాల్ ప్రజలు బీజేపీ ..మేనిఫెస్టో చేతికి చిక్కుతారా..లేదా అనేది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి...

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...
video

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ట్రైల‌ర్‌: ఇది మ‌రో ర‌కం సినిమా

https://youtu.be/UY31pDh055o?si=kVsguDvBSdE7xJ5Y 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న నుంచి వ‌స్తున్న మ‌రో పూర్తి స్థాయి మాస్‌, మ‌సాలా, పొలిటిక‌ల్ ధ్రిల్ల‌ర్‌... 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'....

బీఆర్ఎస్ ను బుక్ చేసిన సీబీఐ మాజీ జేడీ..!?

ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close