“ఏపీ దివాలా”కు ఎదురుదాడే మంత్రం..!

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల రాజకీయం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా చేస్తోందని అది దివాలా స్థితేనని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిని సమర్థించుకునేందుకు ప్రభుత్వం అటు ప్రభుత్వ పరంగా.. ఇటు రాజకీయ పరంగా ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వం అప్పులపై ఓ వివరణ పత్రం విడుదల చేసింది. దీని ప్రకారం… 2014-19లో అంటే టీడీపీ హయాంలోనే అప్పులు తారాస్థాయికి చేరాయని… తమ హయాంలో కాదని ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అప్పులు తెచ్చామని ఒప్పుకున్న ఏపీ సర్కార్.. రెవెన్యూ భారీగా పడిపోయినా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేశామని చెప్పుకొచ్చింది. అదే సమయంలో అప్పుడు ఒక్క ఏపీనే చేయలేదని.. కేంద్ర ప్రభుత్వం కూడా చేసిందని చెప్పుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో రూ. 18,48,655 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది. పనిలో పనిగా.. గత ప్రభుత్వ పాలసీలు ఆర్థిక వ్యవస్థకు పక్షవాతం వచ్చేలా చేశాయని నిందించేశారు. ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కంటే పది వేల కోట్ల వరకూ ఎక్కువ అప్పులు చేస్తున్నట్లుగా కాగ్ రిపోర్ట్ బయటకు రావడంతో పాలన తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇదేం పాలన అని అందరూ విమర్శించడం ప్రారంభించారు. ప్రజల్లో కూడా చర్చ జరుగుతూండటంతో ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. రాజకీయంగా ఎదురుదాడే ఆ వివరణ.

ఓ వైపు ప్రభుత్వం విడుదల చేసిన పత్రంలో టీడీపీ హయాంలో చేసిన అప్పులనే ఎక్కువగా పేరొనగా.. వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి… చంద్రబాబు ఏమైనా సింగపూర్‌కు అప్పు ఇచ్చారా అంటూ వితండవాదాలు వినిపించారు. పేదలకు పంచడానికే జగన్ అప్పులు చేశారని వాదించారు. నిజానికి చేసిన అప్పులు ఎన్ని.. దేనికి ఖర్చు పెట్టారన్న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాలు బయటపడతాయనే బడ్జెట్ పెట్టలేదని అంటున్నాయి. దీంతో సమర్థించుకోవడానికి వైసీపీతో పాటు ప్రభుత్వం కూడా తంటాలు పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close