“మత్తు ఎమ్మెల్యే”లంతా టీఆర్ఎస్ వాళ్లే..!?

బెంగళూరు పోలీసుల డ్రగ్స్ కేసు ఆపరేషన్ టీఆర్ఎస్‌లో తుపాను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు పోలీసుల రాడార్‌లో నలుగురు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్‌కు చెందిన వారేనని.. ఆపార్టీలో గుప్పు మంటోంది. ఒకరు కాంగ్రెస్ తరపున అనూహ్య విజయం సాధించి.. టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మిగిలినముగ్గురూ ఉమ్మడిగా తెలంగాణ జిల్లాకు చెందినవారిగా టీఆర్ఎస్‌లోనే ఓ అంచనాకు వచ్చారు. వీరిలో ఒకరిపై గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన ఇద్దరూ బెంగళూరు లింక్‌తో హైలెట్ అవుతున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే చుట్టూ ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన యువకుడు. అంతే కాదు.. ఫేజ్ త్రీ పార్టీల పై ఎక్కువ ఆసక్తిగా ఉంటారు.కొన్నాళ్ల కిందట.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో దాడి జరిగింది. ఆ ఘటనలో ప్రధానంగా ఈ ఎమ్మెల్యే పేరు కూడా వినిపించింది. పార్టీలంటే పడి చచ్చే ఎమ్మెల్యే బెంగళూరుకూ తరచూ వెళ్తూంటారని.. అక్కడే ఇరుక్కుపోయారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. బెంగళూరు పోలీసులు ప్రధానంగా ఒక ఎమ్మెల్యే గురించి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి.. విచారణకు పిలుస్తున్నారు. ఆయన వెళ్లడంలేదు.

రేపో మాపో అరెస్ట్ చేసి తరలించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యే ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేను బెంగళూరు పోలీసులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పట్టుకుంటే… తర్వాత పొలిటికల్ సీన్ కూడా మారిపోతుందన్న అభిప్రాయం… వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్లుగా బెంగళూరు పోలీసులు పెట్టకపోతే… ఇక్కడ సంచలనాలు.. నమోదయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close