కేంద్రానికి కూడా నో అప్పుల డీటైల్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని కాగ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అవన్నీ కాగ్ పరధిలోకి వచ్చే అప్పులు. కానీ ప్రభుత్వం ముసుగులో గుద్దులాటలుగా.. పెద్ద ఎత్తున ఇతర పద్దతుల్లో అప్పులు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి ఆ ఏడాది చేసిన అప్పుల వివరాలు మొత్తం ఇస్తేనే.. తదుపరి అప్పులు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఏపీ సర్కార్ ఇంత వరకూ అప్పుల వివరాలు ప్రకటించలేదు. కేంద్రానికి పంపలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త అప్పులు చేయడానికి ఏపీ సర్కార్‌కు అవకాశం చిక్కడం లేదు.

నిజానికి కేంద్రం ఈ సారి ఏపీ సర్కార్‌కు భారీగా రుణం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా ఏకంగా రూ. 42వేల కోల్ల రుమం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఈ రుణం తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు పూర్తి చేయాలి. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పుల వివరాలు, గ్యారంటీల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలు, అందులో రెవెన్యూ వ్యయం ఎంత.. పెట్టుబడి వ్యయం ఎంత..చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది రహస్యం అనుకున్నారేమో కానీ… ఏపీ పూర్తిస్థాయిలో కాకుండా తాత్కాలికంగా కొంత సమాచారాన్ని కేంద్రానికి పంపింది. ఈ వివరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే పర్మిషన్ ఇవ్వలేదు.  

జీతాలు, పెన్షన్లకుకూడా.. అప్పుల మీదే ఆధారపడే పరిస్థితి వచ్చిందంటే.. ఇది దివాలా దశేనని.. ఆర్థిక నిపుణులతో పాటు విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నా… పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోతున్నయని.. తీసుకొస్తున్న అప్పులు.. వస్తున్న ఆదాయం అంతా ఏం చేస్తున్నారో చప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఉలుకు.. పలుకు ఉండటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close