“విదేశీ కరోనా సాయం” అంతా ఎటు పోతోంది..!?

భారత్ దుస్థితి చూసి ప్రభుత్వం పెద్దగా చలించకపోయినా ప్రపంచంలోని ఇతర దేశాలు మాత్రం కన్నీరు పెట్టుకుని.. ప్రజల ప్రాణాల్ని కాపాడతామంటూ పెద్ద ఎత్తున సాయాన్ని పంపిస్తున్నాయి. అందులో ప్రజల ప్రాణాలను నిలిపే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దగ్గర్నుంచి మెడిసిన్స్ వరకూ అన్నీ ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇతర దేశాల నుంచి వస్తున్న చారిటీ ఫ్లైట్స్ పెద్ద ఎత్తున ల్యాండ్ అవుతున్నాయి. అన్ లోడ్ చేసి వెళ్లిపోతున్నాయి. కానీ.. అన్‌లోడ్ చేసిన ఆ సాయం అంతా.. కేంద్రం ఎలా సద్వినియోగం చేస్తుందో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఆ సరకుంతా ఎక్కడ దాచి పెడుతున్నారో కానీ… అవసరమైన వారికి మాత్రం సరఫరా చేయడం లేదన్న క్లారిటీ మాత్రం మెల్లగా వస్తోంది.

విదేశాల నుంచి వస్తున్న మెడికల్ సామాగ్రిని … కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాలి. రాష్ట్రాలు మొత్తం కలిపితేనే కేంద్రం. కేంద్రానికి సంబంధించిన ఆస్పత్రులు రాష్ట్రాల్లో ఉంటే.. అవి ఎయిమ్స్ లేకపోతే.. ఈఎస్‌ఐ లాంటి అతి కొద్ది మాత్రమే ఉంటాయి. వాటికి అయినా విదేశాల నుంచి సాయం రూపంలో వస్తున్న మెడికల్ సామాగ్రి పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ఇస్తారు. అయితే ఇప్పటి వరకూ ఏ రాష్ట్రానికీ ఇచ్చినట్లుగా లేదు. ఢిల్లీ నుంచి సాయం తీసుకుని ఇతర రాష్ట్రాలకు ఫ్లైట్లు ఎగిరినట్లుగా కూడా రికార్డుల్లో లేదు. దీంతో.. ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ఆక్సిజన్ కొరత కారణం కావొచ్చు.. ఆక్సిజన్ అందించే పరికరాల కొరత కారణం కావొచ్చు.. దేశంలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న వారి వార్తలే కనిపిస్తున్నాయి. ఒక్క ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఉన్నా.. పదుల సంఖ్యలో ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఎలాగూ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి.. కనీసం విదేశాల నుంచి సాయంగా వస్తున్న వాటినైనా.. రాష్ట్రాలకు పంపి.. ఆక్సిజన్ మరణాలను తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడంపై… విస్మయం వ్యక్తమవుతోంది. ఇలాంటి విషయాలను చెప్పిన మీడియాపై కక్ష సాధింపులకు దిగుతున్నారు కానీ.. దాని వల్ల ప్రజల ప్రాణాలు నిలబడవన్న నిజాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close