రఘురామ కేస్ : సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు..!

రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశంపై సీబీఐ లేదా.. మరో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ లేదా మరో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… రఘురామ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… కేంద్రం, సీబీఐలను ప్రతివాదులుగా గుర్తిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ప్రతివాదాలుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తోపాటు సీఐడీలను గుర్తించలేదు. రఘురామకృష్ణరాజు కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌లోనే ప్రతివాదులుగా వారిని తొలగించారు.

ఏపీ సర్కార్, సీఎం జగన్, సీఐడీలను ప్రతివాదులుగా తొలగించడంపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేసి.. వారిని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరినా… ధర్మాసనం అంగీకరించలేదు. తమ రిస్క్ మీదే ప్రతివాదులను తొలగించామని.. రఘురామకృష్ణ కుమారుడు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. దీంతో 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది. వాదనలు వినకుండా ఏ నిర్ణయమూ తీసుకోబోమని చెప్పిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.

ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐలను మాత్రమే చేర్చడంతో వారు సీబీఐ విచారణకు అనుకూలంగానే కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే.. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఎంపీపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అంశాన్ని కేంద్రం తేలికగా తీసుకునే అవకాశం లేదు. విచారణ చేస్తారా అంటే .. చేయలేమని చెప్పే పరిస్థితి సీబీఐకి లేదు. ఈ కారణంగా సీబీఐ విచారణ జరగడానికే ఎక్కువ అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close