జగన్ అనుమతి లేకుండా కృష్ణాబోర్డు “సీమ”లో అడుగు పెట్టగలదా..!?

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందేనని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను కేఆర్ఎంబీ అమలు చేయలేకపోయింది. దీనిపై తెలంగాణ సర్కార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం సహకరించలేదని.. కేఆర్ఎంబీ అధికారులు ఎన్జీటీకి తెలిపారు. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. అక్కడ ఎవరూ పర్యటించాల్సిన అవసరం లేదని.. అక్కడి పరిస్థితిపై తామే నివేదిక ఇస్తామని వాదించింది. అక్కడ డీపీఆర్ తయారీకి అవసరమైన సర్వేపనులు మాత్రమే చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

ఏపీ సర్కార్ వాదనను ఎన్జీటీ పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి.. నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని మరోసారి ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సీమ ఎత్తిపోతలను పరిశీలించేందుకు కావాల్సిన హెలికాఫ్టర్.. భద్రతా ఏర్పాట్లను తాము కల్పిస్తామని తెలంగాణ సర్కార్ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై గతంలోనే ఎన్జీటీ స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా చేస్తున్నారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి … పనులు జరుగుతున్న ఫోటోలు, దృశ్యాలతో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు.

దానిపై విచారణ జరిపిన ఎన్జీటీ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తక్షణం… రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో ఉన్న పరిస్థితిని.. నిర్మాణాలు ఏమైనా జరిగాయేమో చెప్పాలంటే్… కృష్ణా రివర్ బోర్డుని… పర్యావరణశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కానీ వారు పరిశీలన చేయలేకపోయారు. ఎన్జీటీ తీర్పు తర్వాత కూడా.. అక్కడ పర్యటించడానికి ఏపీ సర్కార్ అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు ఏపీకి సంబంధం లేకుండా పరిశీలించాలని కేఆర్ఎంబీకి ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు.. ప్రభుత్వ వ్యూహం ఎలా ఉంటుందో.. వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close