మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ తీర్మానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. మామూలుగా అయితే ఏపీ ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ బిల్లు రూపంలోకి మార్చి.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉభయసభలు ఆమోదిస్తే శాసనమండలి రద్దవుతుంది. కొత్తగా పెట్టాలన్నా అదే ప్రక్రియ ఉంటుంది.

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారం చేపట్టిన మొదట్లో టీడీపీ ఎమ్మెల్సీలు అధికంగా ఉండేవారు. ఓ సారి రాజధాని బిల్లును వెనక్కి పంపడంతో… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. నిబంధనల ప్రకారం.. మూడొంతుల సభ్యుల మద్దతుతో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం ఇప్పటి వరకూ ఆ తీర్మానం జోలికి వెళ్లలేదు. కానీ ఆ తర్వాత ఖాళీ అయిన మండలి సభ్యులను సీఎం జగన్ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ వస్తున్నారు.

ఇప్పుడు వైసీపీకి మండలిలో మెజార్టీ ఉంది. దీంతో శాసనమండలి రద్దుపై వైసీపీ సైలెంట్ అయింది. మండలి రద్దు చేస్తూ.. అన్న మాటలన్నింటినీ మర్చిపోయారు. అయితే ఇప్పుడు టీడీపీ ఆ అంశాన్ని గుర్తు చేయడం ప్రారంభించింది. కేంద్రంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో .. వైసీపీ మళ్లీ అడిగితేనే శాసనమండలిని కేంద్రం రద్దు చేసే అవకాశం ఉంది. లేకపోతే.. అంతే కోల్డ్ స్టోరేజీలో ఉంచే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close