పాపం ఐఏఎస్‌ : ఉపాధి నిధులు చెల్లించే వరకూ కోర్టు చుట్టూ తిరగాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల్ని జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిలు కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. విచారణ జరిగిన ప్రతీ సారి ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సి వస్తోదంి. ఈ రోజు జరిగిన విచారణకు పంచాయతీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, హరీష్ రావత్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్‌ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు తెలిపారు.

అయితే ఈ రూ. నాలుగు వందల కోట్ల చెల్లింపులు పంచాయతీల ఖాతాల్లో జమ చేశామని.. కాంట్రాక్టర్లకు చెల్లించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు చెప్పారు. నగదు నేరుగా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని వారు ధర్మాసనం దృష్టికితీసుకెళ్లారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించి ఆ వివరాలు తమకు చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. తమకు హాజరు నుంచి మినహాయింపు కావాలని అధికారులు కోరారు. అయితే హైకోర్టు మాత్రం విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ రోజు విచారణలోనూ ఏపీ, కేంద్రం వేర్వేరుగా వాదించాయి.

కేంద్రం నుంచి నిధులు రావాలని ఏపీ లాయర్లు .. కేంద్రం ఇచ్చేసిందని కేంద్రం తరపు లాయర్లు వాదించారు. ఎవరెవరు ఎంతెంత చెల్లించారన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉపాధి పనుల బిల్లులపై నిన్న జరిగిన విచారణలో పిటిషన్లు దాఖలు చేసిన ఐదు వందల మందికి రెండు వారాల్లో డబ్బులు చెల్లించాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close