ఉపఎన్నిక వాయిదా కోరి కేసీఆర్ రాంగ్ స్టెప్ వేశారా..!?

ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలు తమ ఎన్నికల్లో పరిస్థితులు బాగున్నాయని ఎన్నికలు పెట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఈసీ కూడా ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే గత నాలుగైదు నెలల నుంచి రాజకీయంగా హోరెత్తిపోతున్న హుజురబాద్‌లో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు అనుకూలమైన వాతావరణం లేదని నివేదిక పంపడమే. పండుగల సీజన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దానికి ఈసీ అంగీకరించి వాయిదా వేసింది. ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్ .. ఇప్పుడు వాయిదా ఎందుకు కోరారన్న చర్చ రాజకీయ పార్టీల్లోనూ ప్రారంభమయింది. సామాన్యుల్లోనూ అదే అనుమానం.

కేసీఆర్ హుజురాబాద్ విషయంలో చాలా ఎక్కువ దృష్టి పెట్టడం.. వేల కోట్లు పంటడానికి వెనుకాడక పోతూండటం.. ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు హుటాబుటిన పదవులు కట్టబెడుతూండటంతో అక్కడంత సులువుగా లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంత చేసినా ఈటలే గెలుస్తారన్న ఓ ప్రచారం మాత్రం జన బాహుళ్యంలోకి వెళ్లిపోయింది. దీనికి కారణం ఈటల నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ ముఖ్యనేత. ఆయనను బయటకు పంపిన కారణంపై ప్రజల్లో అభ్యంతరాలున్నాయి. అదే సమయంలో ఉద్యమ సమాజంలో ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన చేరిన పార్టీపై అభ్యంతరాలున్నా అక్కడ పార్టీప్రస్తావన రావడం లేదు. ఈటలకు మద్దతా వద్దా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ తాడో పేడో తేల్చుకని విజయం సాధించి తిరుగులేని నిరూపించుకుంటారని అనుకున్నారు. కానీ కేసీఆర్ వాయిదాకే మొగ్గు చూపారు.

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదని ఇప్పటి వరకూ అంతర్గత ప్రచారం జరగడానికి కారణం టీఆర్ఎస్ అధినేత దూకుడుగా తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరడానికి కూడా ప్రభుత్వం ఉపఎన్నికను వాయిదా కోరడం కారణం అవుతుంది. ఇవన్నీ టీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక తప్పిదాలేనంటున్నారు. ఓటమి భయంతోనే ఉపఎన్నికలను వాయిదా వేయించారని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ విమర్శలను డిఫెండ్ చేసుకోవడం టీఆర్ఎస్‌కు కాస్త కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close