దళిత బంధుపై కాంగ్రెస్‌లో గందరగోళం – కేసీఆర్‌తో మరోసారి భేటీకి భట్టి !

దళిత బంధు పథకంపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అది ఓట్ల పథకం మాత్రమేనని మండిపడుతున్నారు. అయితే ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకం విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. పైగా ముఖ్యమంత్రి నుంచి ఈ పథకం విషయంలో ఆహ్వానాలు వస్తే ఏ మాత్రం తడుముకోకుండా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మొదటి సారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మరోసారి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తాజాగా నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేస్తున్నారు.

అందులో భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. దీంతో వెళ్లాలా వద్దా .. అని తర్జన భర్జన పడిన భట్టి విక్రమార్క చివరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన ఇంటికి టీ కాంగ్రెస్ ముఖ్యుల్ని ఆహ్వానించి చర్చించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా పేరు పొందినవారంతా హాజరయ్యారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి కూడా వచ్చారు. అదే సమయంలో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ కూడా వచ్చారు. ఇటీవల మధుయాష్కీ కోమటిరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లుగా చాలెంజ్ చేశారు.

ఈ సమావేశంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ చివరికి భట్టి విక్రమార్క మాత్రం సీఎంతో సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దళిత బంధు పథకమేపెద్ద మోసమని వాదిస్తున్న కాంగ్రెస్ .. ఆ పథకం అమలు విషయంలో జరుగుతున్న సమావేశా లకు వెళ్లడం ఎందుకన్న వాదన సహజంగానేవస్తుంది. ఈ గందరగోళాన్ని కాంగ్రెస్ నేతలే పెంచుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు …విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని...

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

HOT NEWS

css.php
[X] Close
[X] Close