సోనూ సూద్‌పైనా ఐటీ ఎటాక్ !

ఢిల్లీ ప్రభుత్వంతో ఇటీవల సోనూసూద్ ఓ “దేశ్‌ కే మెంటార్స్” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పుకున్నారు. అలాగే పంజాబ్ ప్రభుత్వానికి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా వరుసగా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలతో అసోసియేట్ అవుతున్నప్పుడే చాలా మంది నెక్ట్స్ సోనూ సూద్ వంతే అని అనుకున్నారు. అది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది. సోనూసూద్‌కు చెందిన ఇళ్లు ఇతర కార్యాలయాలపై ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేశారు. ముంబైలో ఆయనకు ఇల్లుతో పాటు ఓ హోటల్ ఉంది. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.

వాటన్నింటిపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా సమయంలో విపరీతంగా సహాయ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి. ఓ సమయంలో ఆయన బీజేపీ ఏజెంట్ అని శివసేన మండిపడింది. ఆ తర్వాత ఆయన నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.

ఎప్పుడూ రాజకీయాల జోలికి సోనూసూద్ వెళ్లలేదు. అయితే బీజేపీ మాత్రం అలా అనుకున్నట్లుగా లేదు. త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆప్‌ ప్రభుత్వంతో జట్టు కట్టడం రాజకీయ అడుగేనని అనుకున్నారేమో కానీ ఐటీ దాడులు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. సోనూసూద్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి. బీజేపీతో ఎవరు విబేధించినా వారిపై ఐటీ, ఈడీ, సీబీఐ లాంటివి దాడులు చేయడం గత ఏడేళ్ల కాలంలో జరుగుతూనే ఉంది. అందుకే సోనుసూద్ పై ఐటీ దాడుల విషయంలోనూ అదే తరహా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close