మీడియా వాచ్: అత్యాచార ఘటన సోషల్ మీడియా వల్లే వెలుగు లోకి వచ్చిందా?

హైదరాబాద్ నగరం లోని సింగరేణి కాలనీ లో ఆరేళ్ల పాప పై జరిగిన అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజల కు విస్మయాన్ని కలిగించింది. అయితే సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఘటన జరిగి ఇప్పటికి ఆరు రోజులు అయినప్పటికీ, ఈ ఘటన వెలుగు లోకి రావడానికి, తెర మరుగు కాకుండా ఉండడానికి సోషల్ మీడియా నే కారణం అయింది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు అన్న చర్చ జరుగుతోంది. అంతే కాకుండా, ఈ సంఘటన విషయం లో మన మీడియా ప్రవర్తించిన తీరు పై విమర్శలు వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే..

హేయమైన సంఘటన:

నల్గొండ నుండి కూలి పనుల కోసం నగరానికి వచ్చిన కుటుంబం లోని ఆరేళ్ళ పాప పై, ఆ పాప ఇంటికి పక్కనే ఉండే రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి, చంపేసి, పరార్ అయ్యాడు. పాప కనిపించక పోయేసరికి కంగారు పడి అన్ని చోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరికి అదే వీధిలో జులాయి గా తిరుగుతున్న రాజు పై అనుమానం వచ్చి ఆయన ఇల్లు తాళం పగుల గొట్టి లోపలికి వెళ్ళి చూసే సరికి అక్కడ చిన్నారి పాప విగత జీవిగా పడి కనిపించింది.

పెద్దగా స్పందించని మీడియా:

ఈ ఘటన జరిగిన నాటి నుండి సోషల్ మీడియా వేదిక గా సెలబ్రిటీలు స్పందిస్తూ, చిన్నారి పాప కు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. సెలబ్రిటీలే కాకుండా సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా వేదిక గా పాప కు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకుని రావడమే కాకుండా పోలీసుల పై , వ్యవస్థ పై ఈ కేసు విషయంలో ఒత్తిడి తీసుకు రావడానికి వారు చేయగలిగింది అంతా చేశారు. ఈ అన్యాయాన్ని ఫోకస్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయవలసిన తెలుగు మీడియా ఎందుకనో ఈ అంశాన్ని మొదటి నాలుగు రోజుల పాటు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి దళితులు, గిరి జనులు, బడుగులు, పేదల ఇంటికి చెందిన చిన్నారులు, ఆడ పిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు లోనైనప్పుడు మన తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదని, దిశ వంటి వారి విషయంలో స్పందించిన తీరు లో, పేద ఆడపిల్లలకు అఘాయిత్యం జరిగినప్పుడు తెలుగు మీడియా స్పందించడం లేదని ఒక విమర్శ చాలా కాలం గా ఉంది. ఇటు వంటి సంఘటనలు జరిగిన ప్రతి సారి తెలుగు మీడియా ఆ విమర్శలు నిజం చేసేలా ప్రవర్తిస్తోంది

అపోలో హాస్పిటల్ బయట మీడియా కు గడ్డి పెట్టిన కుర్రాడు:

అపోలో హాస్పిటల్ వద్ద సాయి ధరంతేజ్ హెల్త్ కండిషన్ గురించి వివరాలు తీసుకొని ప్రసారం చేయడానికి కెమెరాలు వేసుకుని పడి గాపులు కాస్తున్న తెలుగు మీడియా ని ఉద్దేశించి , జన సేన పార్టీ కి చెందిన సంపత్ నాయక్ అనే వ్యక్తి మీడియా పర్సన్స్ ని చూపిస్తూ మరీ కడిగి పడేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆరేళ్ల పాప మీద జరిగిన అత్యాచారం గురించి వార్తలు కవర్ చేయకుండా అపోలో హాస్పిటల్ ముందు పోలో మని కూర్చున్న మీడియా వ్యక్తులకు సిగ్గు అనేది ఉందా అంటూ ఆయన చేసిన విమర్శలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత తెలుగు మీడియా కొంచెం మేలుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యం లో సోషల్ మీడియా గనుక లేకపోయి ఉంటే ఈ ఘటన అనేక కేసుల లో ఒకటి గా తెర మరుగు అయి పోయి బాధిత కుటుంబం న్యాయాని కి నోచుకోకుండా మిగిలి పోయే పరిస్థితి ఏర్పడి ఉండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.‌

మరి కనీసం ఇప్పటికైనా తెలుగు మీడియా బాధ్యతాయుతంగా నడుచుకోవడం నేర్చుకుంటుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close