ర‌వితేజ లేకుండానే విక్ర‌మార్కుడు 2?

ఈమ‌ధ్య వార్త‌ల్లోకి వ‌చ్చిన సీక్వెల్‌… విక్ర‌మార్కుడు 2. రాజ‌మౌళి – ర‌వితేజ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఇది. మాస్ అనే ప‌దానికి ఈ సినిమా అచ్చ‌మైన నిర్వ‌చ‌నంలా ఉంటుంది. అప్ప‌ట్లో మిగిలిన భాష‌ల్లోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఇప్పుడు సీక్వెల్ ఆలోచ‌న వ‌చ్చింది.

విక్ర‌మార్కుడు 2 క‌థ‌ని ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ సిద్ధం చేశారు. అయితే రాజ‌మౌళి కోసం కాదు. ఓ నిర్మాత కోసం. ఆ నిర్మాత ఈ క‌థ‌ని సంప‌త్ నందితో తెర‌కెక్కించాల‌ని చూస్తున్నాడు. హీరోగా ర‌వితేజ‌నే అనుకున్నా.. ర‌వితేజ‌కు ఇప్పుడు కొత్త సినిమాలు సంత‌కాలు చేసేంత తీరిక లేదు. త‌ను మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ బిజీనే. అందుకే ఈ సీక్వెల్ లో ర‌వితేజ‌కు బ‌దులుగా మ‌రో హీరోని ఎంచుకోవాల‌ని చూస్తున్నారు. అలా హీరో, ద‌ర్శ‌కుడు మారితే.. విక్ర‌మార్కుడు 2 అనే టైటిల్ ఉంటుందా? లేదా? అనేది అనుమానం. ఎందుకంటే ఇద్ద‌రిలో ఎవ‌రు మారినా, అదే టైటిల్ తో సినిమా చేయ‌డం అన‌వ‌స‌రం. అలా చేస్తే… అదో కొత్త పంథా అవుతుంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి మాత్రం ఈ సినిమాని పూర్తిగా విక్ర‌మార్కుడు స్టైల్ లోనే రాశార్ట‌. మ‌రి ఇప్పుడు టైటిల్ మారుస్తారేమో చూడాలి. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది తేలితే.. ఈ సినిమాపై ఓ క్లారిటీ వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close