చంద్రబాబు ఢిల్లీ పర్యటన అలా ముగిసింది !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చారు. రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న విజ్ఞప్తి చేసి .. అక్కడ మీడియాతో మాట్లాడటం మినహా ఇంకెవర్నీ కలవలేకపోయారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు లభిస్తాయని టీడీపీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసినా ఆ మేరకు వారి నుంచి స్పష్టత రాలేదు. అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అక్కడి వ్యవహారాలపై తీరిక లేకుండా ఉన్నారు.

ఇక ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కూడా లభించే అవకాశం కనిపించలేదు. దీంతో చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం టీడీపీ బృందంతో తిరిరిగి వచ్చేశారు. కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీలో పరిస్థితులను వివరించాలనుకున్నారు. అవినీతి గురించి చెప్పాలనుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఒక్క రాష్ట్రపతిని మాత్రం కలిసి .. ఫిర్యాదు చేయగలిగారు. అయితే ఈ ఫిర్యాదు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని టీడీపీ వర్గాలకూ తెలుసు.

మరో వైపు రాష్ట్రపతిని కలిసే వరకూ పోలీసులు టీడీపీ ఆఫీసు, పట్టాభి ఇళ్లపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశామని ప్రకటనలు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు మాట మార్చారు. ఎవర్నీ అరెస్ట్ చేయలేదని.. వారికి నోటీసులు మాత్రమే జారీ చేశామంటున్నారు. దీంతో టీడీపీ నేతల ఢిల్లీ పర్యటన కనీసం తమ ఆపీసులు, ఇళ్లపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయించలేకపోయిందన్న సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close