గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట ఆడుకున్న వైసీపీ ఇప్పుడు ఏపీ పోలీసులే తమ చేతులో ఉండటంతో ఏం చేయగలదో అది చేసి చూపిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలకు ఏపీ నుంచి వెళ్తున్న గంజాయి వ్యవహారంలో అక్కడి పోలీసులు ఏపీ నుంచి వస్తుందని చెప్పడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. వారంతా చంద్రబాబు కుట్రలో భాగస్వాములని.. ఆరోపించడం ప్రారంభించారు.

హైదరాబాద్ కమిషనర్ తో పాటు నల్లగొండ ఎస్పీ కూడా ఏపీ నుంచి గంజాయి వస్తోందని ఇటీవల స్పష్టంగా ప్రకటించారు. మ్యాప్‌లు చూపించి మరీ ఎలా వస్తుందో చెప్పారు. వీళ్లిద్దరే కాదు ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల పోలీసులూ అదే చెప్పారు. ఇప్పుడు వీళ్లందర్నీ షరా మామూలుగా టీడీపీ ఏజెంట్లు.. చంద్రబాబుతో కలిసి కుట్ర చేశారంటూ ఆరోపణలు ప్రారంభిచేశారు వైసీపీ పార్టీ నేతలు. ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి విజయసాయిరెడ్డి ఇదే చెప్పారు. పైగా తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆధారాలు లేకుండానే రాత్రికి రాత్రి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కానీ ఆధారాలుంటే ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టారో ఆయన చెప్పలేకపోయారు.

తమ ప్రతి వైఫల్యానికి చంద్రబాబు కారణంగా చెప్పడం వైసీపీ విధానాల్లో ఒకటి. అయితే రాష్ట్రంలో వరకు అయితే సరే ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు కూడా చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అని చెబితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏపీలోని పోలీసులే ఇప్పుడు చంద్రబాబు మాట వినడం లేదు. ఇక పక్క రాష్ట్రాల పోలీసులు వింటారా…? ప్రజల్ని.. యువతను నిర్వీర్యం చేస్తున్న ఓ మహమ్మారి గురించి పట్టించుకోకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై కుట్ర సిద్ధాంతాలు వల్లిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోంది. అందు కోసం ఆ కేసుల్ని బయట పెడుతున్న పోలీసుల్ని సైతం వదిలి పెట్టడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close