అదానీకి 130 ఎకరాలు ఎన్ని సార్లు కేటాయిస్తారు !?

జనవరిలో అమ్మఒడి ఎవరికీ ఇవ్వడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 75 శాతం హాజరు ఉంటే జూన్‌లో ఇవ్వాలని మంత్రివర్గ సమావేసంలోనే నిర్ణయించారు. అంటే జనవరిలో రూ. ఆరు వేల కోట్ల వరకూ నిధులు సేకరించి అవసరం తప్పిపోయినట్లయింది. మళ్లీ జూన్‌కు వచ్చే సరికి కొత్త ఆర్థిక సంవత్సవరం వస్తుంది కాబట్టి అప్పుడు కొత్త అప్పుల ద్వారా పథకాన్ని అమలు చేయవచ్చు. అయితే అప్పటికి విద్యాసంవత్సరం మారుతుంది. అంటే ఓ ఏడాది ఎగ్గొట్టినట్లేనని భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని పాత నిర్ణయాలను కూడా కొత్తగా తీసుకున్నారు.

విశాఖలో 130 ఎకరాలను అదాని డేటా సెంటర్ కు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్ని నాని ప్రకటించారు. అయితే ఇది గత ఏడాది నవంబర్‌లో జరిగిన కేబినెట్ భేటీలోనే తీసుకున్నారు. ఆ నిర్ణయం తర్వాత విజయసాయిరెడ్డి అహ్మదాబాద్ వెళ్లి అదానీని కలిసి కేబినెట్ నిర్ణయం గురించి చెప్పి వచ్చారు. కానీ అదానీ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు కేటాయింపులు చేస్తూ మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండురోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే శారదాపీఠానికి పదిహేను ఎకరాలను కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్‌ 17 నుంచి నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేిబనెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ నుంచి యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 25 ఏళ్ల పాటు పీపీఏ చేసుకోవాలని నిర్ణయించారు. అలాగే కొంత కాలంగా చర్చనీయాంశం అవుతున్న సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక ఏపీలో సినిమా టిక్కెట్లు ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్ముతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close