కొత్త జిల్లాల రాజకీయం వర్కవుట్ అవుతుందా !?

ముఖ్యమంత్రి జగన్ కావాలని చెబుతారో.. లేక ఎప్పుడు ఏది గుర్తొస్తే అది చెబుతారో కానీ పార్లమెంట్‌లో ఎంపీలు ఏం మాట్లాడాలో నిర్దేశించే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మాట్లాడారు. అసలు ఎంపీలకు.. కొత్త జిల్లాలకు సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఆయన అలా మాట్లాడారని మీడియాకూ లీకులు ఇచ్చారు. అంతే ఇక కొత్త జిల్లాల రాజకీయాన్ని జగన్ ప్రారంభించారని అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. నిజానికి ఏడాదిన్నర కిందటే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ.. జిల్లాల వారీగా కమిటీల్ని ఏర్పాటు చేశారు.

అప్పట్లో నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని గడువు విధించారు. ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత చప్పుడు లేదు . ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయమూ వెనక్కి తీసుకున్నారు. నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదు. కొత్తగా జనాభా లెక్కలను కేంద్రం తీసుకోవాల్సి ఉంది. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రకారం.. జనగణన పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్‌, జిల్లాల సరిహద్దులను కదిలించడానికి వీల్లేదు.

ఈ మేరకు భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఫ్రీజ్‌ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. లెక్క ప్రకారం.. జనాభా లెక్కలు పూర్తయి.. వాటి ఫలితాల నోటిఫికేషన్‌ విడుదల చేసే వరకు ఫ్రీజ్‌ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. పదేళ్లకోసారి ఈ జన గణన జరుగుతుంది కాబట్టి.. లైట్ తీసుకోవడానికి లేదు. జనగణన పూర్తయిన తరవాతే జిల్లాల గురించి ఆలోచించాలి. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు జనగణన వాయిదా పడుతోంది. అయినా జిల్లాల విభజన పేరుతో కాస్త చర్చను సమస్యల నుంచి పక్కదారి పట్టించవచ్చన్న ఆలోచన మాత్రం పెద్దలకు ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close