సిరివెన్నెల ఆస్పత్రి ఖర్చులన్నీ ఏపీ ప్రభుత్వానివే !

సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు సాయి యోగేశ్వర్ ఏపీ ప్రభుత్వానికి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల వైద్యానికి అయిన ఖర్చులన్నింటినీ ఏపీ ప్రభుత్వం భరించేలా జగన్ ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం సీఎంవో నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని.. సీతారామశాస్త్రి ఆరోగ్యం గురించి వాకబు చేశారన్నారు.

మరణ ధృవీకరణ తర్వాత ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని.. వైద్యం కోసం ఆస్పత్రికి కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేలా ఆస్పత్రికి ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారని సిరివెన్నెల కుటుంబసభ్యులు తెలిపారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారికి కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.

అయితే ఎంత మొత్తం ఖర్చు అయింది..ఎంత రిలీజ్ చేశారు అన్నదానిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సిరివెన్నెల కుటుంబం మాత్మరే స్పందించింది. ప్రభుత్వం జీవోలను సీక్రెట్‌గా ఉంచడం ప్రారంభించి చాలా కాలం అయింది కాబట్టి… ఎంత ఇచ్చిందనేది తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close