29 రాజధాని గ్రామాలు రెండు కార్పొరేషన్లా ? ఆదానీ లింకేంటి ?

రాజధాని గ్రామాలు మొత్తం ఇరవై తొమ్మిదింటినీ సీఆర్డీఏలో నోటిఫై చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 19 గ్రామాలను ఓ మున్సిపల్ కార్పొరేషన్‌గా..మరికొన్ని గ్రామాలను మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తోంది.ఎందుకిలా చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ నిగూఢమైన వ్యవహారం ఏదో ఉండకపోతే ఇలా చేసే అవకాశం లేదని అందరికీ అర్థమవుతోంది. అందుకే అన్ని గ్రామాల ప్రజలు నిర్మోహమాటంగా అమరావతి కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ అనుకూలంగా మాట్లాడటం లేదు. భిన్నాభిప్రాయాలు ఉన్నా.. అదే నివేదికలో రాసేవారేమో కానీ.. ఆ గ్రామాల్లో అవేమీ కనిపించడం లేదు.

ఒకే అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్ చేయాలి కానీ.. కొన్ని గ్రామాలను మాత్రం విడిగా వద్దనే అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో తెలియదు కానీ … అమరావతి కార్పొరేషన్‌గా చేసిన తర్వాత రాజధాని గ్రామాల్లో ఆరు వేల ఎకరాలు అదానీ సంస్థకు తాకట్టు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం మాత్రం ఉద్ధృతంగా సాగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారని అందుకే.. మూడు రాజధానుల బిల్లు వెక్కి తీసుకోవడం… అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో హడావుడి ప్రారంభించారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కూడా ఇలాంటి విమర్శలే చేశారు. ప్రభుత్వం అమరావతి విషయంలో ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. అడ్డగోలు కుట్రలు చేసేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే వంద శాతం నమ్ముతున్నారు. ప్రభుత్వంపై అమరావతి రైతులకు ఒక్కటంటే ఒక్క శాతం నమ్మకం కూడా లేకుండా పోయింది. అలాంటి పరిస్థితిని ఏపీ ప్రభుత్వం తెచ్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close