ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి మృతి !

ఆర్యన్ ఖఆన్ క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రభాకర్ సెయిల్ కీలక సాక్షి . తన ప్రాణానికి అప్పటి ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే నుంచి ముప్పు ఉందని ఆరోపించారు. షారుఖ్ ఖాన్ కుమారుడైన ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో ఓ క్రూయిజ్‌లో పార్టీ చేసుకుంటూండగా సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు.

వారి వద్ద డ్రగ్స్ ఉన్నాయని .. డ్రగ్స్ సేవించారని కేసు నమోదు చేశారు. ఈ అరెస్ట్ సమయంలో ప్రదీప్ గోసవి అనే ప్రవేటు డిటెక్టివ్ కూడా ఎన్సీబీ బృందంలో ఉన్నారు.ఈ గోసవి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ఆ డ్రగ్స్ కేసు అంతా కుట్ర పూరితం అని గోసవి..ఎన్సీబీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రభాకర్ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో అతడి ప్రాణానికి వాంఖడే నుంచి హానీ ఉందని స్పష్టం చేశారు.

తాను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబర్ లో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ప్రభాకర్ సెయిల్ మృతితో కేసులో అనేక అంశాలు చిక్కుముడిపడిపోయే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close