సీబీఐ దత్త పుత్రుడు, చర్లపల్లి షటిల్ టీం !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలు తనపై అడ్డూ అదుపు లేకుండా చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జనసేనను టీడీపీ బీ అంటే… ఇక నుంచి తాము వైసీపీని చర్లపల్లి షటిల్ టీం అని పిలుస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఆయన మధ్యలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. చంద్రబాబు దత్తపుత్రుడు అని కొంత మంది చేస్తున్న విమర్శలకు.. ఇక కౌంటర్‌గా సీబీఐ దత్తపుత్రుడు జగన్ అని అనాల్సి ఉంటుందన్నారు.

పవన్ కల్యాణ్ చాలా కాలంగా ప్రభుత్వంపై విధానపరంగా పోరాడుతున్నారు. కానీ పవన్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చివరికి ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జగన్ దెయ్యం.. రాక్షసుడు అనడం ప్రారంభించారు. అలాంటి మాటలు తమకు రాక కాదని.. ఇంత కాలం జనసేన అధినేత పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఊరుకునేది లేదని రివర్స్ కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగతంగానే కౌంటర్ ఇవ్వాలని జనసైనికులు కూడా కోరుకుంటున్నారు. అలా ఇస్తేనే డోస్ కరెక్ట్ గా ఉంటుందని లేకపోతే మాటలు మీరిపోతున్నారని భావిస్తున్నారు. ఈ కౌంటర్‌లను ఇలా కొనసాగించాలని కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close