వడ్ల సమస్య తీర్చేసిన కేసీఆర్ !

వడ్లను కొంటారా లేదా అని కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టిన సీఎం కేసీఆర్ చివరికి తామే కొంటామని ప్రకటించారు. కేంద్రం తమ మాటకే కట్టుబడి ఉండటం… బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ సర్కార్ రాసిచ్చిన లేఖలను బయట పెట్టడంతో మధ్యలో రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకున్న కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గింజను కొంటామని ప్రకటించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. బుధవారం నుంచే కొనుగోళ్లు ప్రారంభమవుతాయన్నారు. కనీస మద్దతు ధరకే కొంటామని ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేబినెట్ భేటీలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీవో నెం 111ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో అమల్లోకి వస్తే మొయినాబాద్ వైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఫామ్ ల్యాండ్స్ మాత్రమే అమ్ముకోవడానికి చాన్స్ ఉంది. ఇప్పుడు ఏ ఆటంకాలు ఉండవు అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఫార్మా యూనివర్శిటీ ఏర్పాటు.. చెన్నూరుకు తాగునీరు ప్రాజెక్ట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండో రన్ వే వంటి వాటిపైనా నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఎప్పట‌్లాగే బీజేపీపై విరుచుకుపడ్డారు. పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో కూర్చొని ఉందని… ఏడాది పాటు రైతులు ధర్నాలు చేస్తే వారిని తూలనాడి చివరకు ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. నూకలు తినే అలవాటు చేసుకోవాలని కేంద్రం చెప్పి అవమామించిందన్నారు. కేంద్రానికి పాలన చేతక కాక ఇలాంటి వంకలు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తాము పెంచలేదని కేంద్రం పెంచుతోందన్నారు. అదానీకి పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు కానీ రైతులకు రూపాయి ఇవ్వడానికి మాత్రం మోదీ ప్రభుత్వానికి చేతకాదని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం చాలా రంగాల్లో కుంగిపోయిందని ..ఏదైనా వస్తే లేనిపోని మత విధ్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో శ్రీరామ నవమి సందర్భంగా రెచ్చగొట్టే పనులు చేశారని ఆరోపించారు ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకుపోతే కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో కరెంట ్సమస్య లేదని 5600 మెగా వాట్స్‌ 2023లో మనకు అందుబాటులోకి రాబోతోందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close