బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఆకర్ష్ – అదే బీజేపీ ప్రయోగిస్తే !?

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే ఆ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. నలుగురు హైదరాబాద్ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కండువా కప్పేసింది. కేటీఆర్ సమక్షంలో నలుగురు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కూడా కారెక్కారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ చేరారు.

ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ వెళ్లారు. మోదీతో మాట్లాడి వచ్చారు. ఇప్పుడు మోదీ హైదరాబాద్ రానున్న సమయంలో వారిలో నలుగురు పార్టీ మారిపోయారు. ఓ వైపు దేశం మొత్తం ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరడమే కాదు.. బీజేపీ నేతలు ఇతర పార్టీల్లో చేరే కార్యక్రమాలు జరగడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం సీన్ మార్చేస్తున్నారు. నిజానికి బీజేపీ నుంచి చేర్చుకోవడానికి ఎమ్మెల్యేలు లేరు. ముగ్గురుంటే వారిలో ఇద్దరు టీఆర్ఎస్ నుంచి వెళ్లి ..బీజేపీలో చేరినవారే. ఇంకొకరిది హిందూత్వ కేటగిరి. బీజేపీలో చెప్పుకోదగిన నేతలు కార్పొరేటర్లే.

సీనియర్ నేతలు ఎవరూ పార్టీ మారరు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే షాక్ ఇవ్వాలనుకున్న టీఆర్ఎస్ ఆ మేరకు షాక్ ఇచ్చింది. అయితే బీజేపీ దృష్టి పెడితే… ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు.. ఇప్పుడు నలుగురు కార్పొరేటర్లేనని.. తాము తల్చుకుంటే ఎమ్మెల్యేలు అవుతారని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా బీజేపీని రెచ్చగొడుతున్నారని వారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close