మందుబాబుల్ని తాకట్టు పెట్టడం నిరంతర ప్రక్రియ!

జల్సా సినిమాలో షర్ట్ సీన్‌ను ఏపీ ప్రభుత్వం రిపీట్ చేస్తోంది. అక్కడ షర్ట్ అయితే ఇక్కడ మద్యం. ఏ అవసరం వచ్చినా సీఎం జగన్ మద్యం ఆదాయంపై అప్పులు తీసుకు రాండి అని ఆదేశాలు ఇస్తున్నారు. గతంలో కార్పొరేషన్ పేరుతో మద్యం ఆదాయాన్ని మళ్లించి రూ. పాతిక వేల కోట్లు తెచ్చేసిన సర్కార్.. తర్వాత బాండ్ల బాటలో అప్పులు తెస్తోంది. తమకు ఏటా రూ. ఇరవై వేల కోట్ల మద్యం ఆదాయం వస్తోందని.. చూపించి బాండ్లు వేలం వేసి అప్పులు తెలుస్తోంది. దాదాపుగా పది శాతం వడ్డీ కడుతోంది. ఎప్పటికి రూ. ఎనిమిది వేల కోట్ల తెచ్చేసింది. ఇప్పుడు మరో పాతిక వేల కోట్లు తేవాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది.

అవసరాలు పెరిగిపోతూండటం… అప్పులకు వడ్డీలు.. ఉద్యోగులకు జీతాలు.. పథకాలకు నగదు బదిలీ … సలహాదారులకు జీతాలు ఇలా అన్నీ చూసుకుంటే ఆదాయం.. అప్పులు కూడా సరిపోవడం లేదు. దీంతో వేల కోట్లు కొత్త కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇతర మార్గాలన్నీ మూసుకుపోతే చివరికి ప్రభుత్వానికి మద్యం మాత్రమే కనిపిస్తోంది. అందుకే జగన్ డబ్బుల్లేవంటే మద్యం ఆదాయం తాకట్టు పెట్టమని చెబుతున్నారు. ఈ కారణంగా మరోసారి పాతిక వేల కోట్లకు బాండ్లు వేసి అప్పు తేవాలని నిర్ణయించారు.

ఈ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయి ఉంటుందని.. భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం దాదాపుగా ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. తప్పనిసరిగా తెలియాల్సిన సందర్భంలో తెలుస్తున్నాయి. అలాంటి సందర్భంలోనూ సైలెంట్‌గా ఉంటోంది తప్ప వివరణ ఇవ్వడం లేదు. ఈ ప్రకారం చూసినా మందు బాబులను అదే పనిగా తాకట్టు పెట్టడం మాత్రం నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల...

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close